స్మశానంలో నిద్రించిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు, కేరళ సీఎం పినరాయి ట్వీట్
Recommended Video

పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండు రోజుల పాటు స్మశానంలో నిద్ర చేశారు. అంతేకాదు, ఉదయాన్నే అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఇలా చేయడానికి కారణం ఉంది. అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఆయన ఇలా చేశారు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది నెలల క్రితం ఆ స్మశానం అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని, అయితే అది స్మశానం కావడం.. దెయ్యాలు ఉంటాయని భయపడుతు పలువురు పని చేయడానికి ముందుకు రాలేదన్నారు.

దీంతో వారిలో భయం పోగొట్టేందుకు తాను స్మశానంలో పడుకున్నానని తెలిపారు. ఈ స్మశానం అభివృద్ధికి ప్రభుత్వం రూ.మూడు కోట్లకు పైగా మంజూరు చేసిందని తెలిపారు. ఆయన శుక్రవారం అక్కడే బస చేసి, శనివారం అక్కడే అల్పాహారం తీసుకున్నారు. అక్కడే గెడ్డం గీసుకున్నారు. స్నానం చేశారు. తర్వాత నియోజకవర్గంలో పర్యటించారు. ఆ తర్వాత శనివారం రాత్రి మళ్లీ వచ్చి అక్కడే బస చేశారు.
దీనిపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్మశానంలో నిద్ర చేశారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆత్మలు ఉంటాయని అందరు భయపడితే అతను నిద్రించారని పేర్కొన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications