అద్వానీని చూస్తే బాధేస్తోంది: షబ్బీర్, టిపై బిజెపికి ప్రశ్న
తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్న బిజెపి ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతోందని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని చంద్రబాబు మరోసారి విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావును మానసికంగా హింసించిన చంద్రబాబు హంతకుడన్నారు. సోనియా గాంధీని గాడ్సే అనడం విడ్డూరమన్నారు. అసలు గాడ్సేనే చంద్రబాబు అన్నారు.
మరోవైపు కేంద్ర మంత్రి బలరాం నాయక్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తుండగా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. భద్రాచలం ముంపు ప్రాంతాలు తెలంగాణలోనే ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భద్రాచలం డివిజన్లోని ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలోకి వెళ్ళదని, రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లులో తాము సూచించిన సవరణలకు సోనియా అంగీకరించారని తెలిపారు.