అధికారుల బదిలీలెందుకు .. చంద్రబాబునే చంపెయ్యండి .. శివాజీ సంచలనం
ఏపీలో సీఎం చంద్రబాబు టార్గెట్ గా కేంద్ర సర్కార్ , రాష్ట్రంలోని వైసీపీ , తెలంగాణాలోని కేసీఆర్ కుట్రలకు తెరతీశారని సినీ నటుడు శివాజీ చెప్పారు. చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అందుకే పోలింగ్ కు నాలుగు రోజుల ముందు ఏపీ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష సాధించటానికి ఇలా రాతిరాత్రి చేసే బదిలీలెందుకు ... ఆయన్ని చంపి అడ్డు తొలగించుకుంటే పోతుంది కదా అంటూ కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుది ఒంటరి పోరాటం ..ఈసీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ .. వీహెచ్ సంచలనం
ఏపీ అభివృద్ధికి ప్రతిబంధకంగా ఆ మూడు పార్టీలు
టీడీపీ జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తరపున ఎన్నికల ప్రచారం చేసిన శివాజీ తన ఎన్నికల ప్రచారంలో వైసీపీ , బీజేపీ లపై విరుచుకుపడ్డారు. కేంద్ర సర్కార్ అడుగడుగునా చంద్రబాబుకు ఇబ్బందులు కలిగిస్తుందని , ఈసీ కూడా కేంద్రానికి సహకారం అందిస్తుందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రతిబంధకంగా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీలు మారాయని ఆరోపించారు .
చంద్రబాబు మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే చంద్రబాబుని చంపెయ్యండి
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబు మీద ప్రతీకారం తీర్చుకోటానికే రాత్రికి రాత్రే ఉన్నతాధికారుల బదిలీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా అధికారుల బదిలీలతో ఇబ్బంది పెట్టే బదులు ఒక్కసారే చంద్రబాబును చంపి అడ్డు తొలగించుకోండి అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏపీకి సీఎస్ గా నియమించిన వ్యక్తి జగన్ అక్రమ ఆస్తుల కేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తి అని , ఏపీ సీఎస్ కాదు అతను జగన్ కు అనుకూలంగా వ్యవహరించే పీఆర్ఓ అని శివాజీ వ్యాఖ్యానించారు.
ముప్పేట దాడి చేసినా బాబు స్ట్రాంగ్ అవుతున్నారన్న శివాజీ
ఏపీలో చంద్రబాబు మీద వైసీపీ , టీఆర్ ఎస్ , బీజేపీ ముప్పేట దాడికి సంబంధించిన అన్ని ఆధారాలు తనదగ్గర ఉన్నాయన్న శివాజీ చంద్రబాబును బలహీనం చెయ్యాలని ఎందరు కలిసి ఎన్ని మాస్టర్ ప్లాన్స్ వేసినా చంద్రబాబు అంతకు మించి స్ట్రాంగ్ అవుతున్నారని చెప్పుకొచ్చారు.