ఎఫైర్: ప్రియుడితో ఎంజాయ్, అడ్డుగా ఉన్నాడని భర్త హత్య
చిత్తూరు: వివాహేతర సంబంధం కోసం కట్టుకొన్న భర్తను ప్రియుడితో కలిసి చంపించింది ఓ భార్య. తమ సుఖానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపించిన తర్వాత పెళ్ళి చేసుకోవాలని భావించారు. పెళ్ళి చేసుకొనేందుకు పారిపోతున్న భార్యను ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది.
చిత్తూరు జిల్లాలోని బంగారు పాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డివాని చెరువు సమీపంలో తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన టీచర్ వాసుదేవన్ను సుమోతో శనివారం ఢీ కొట్టి చంపేశారు. ఆర్ఎంపీ వైద్యుడు రమేష్ వాసుదేవన్ ను సుమోతో ఢీకొట్టి చంపాడని పోలీసులు తేల్చి చెప్పారు.
టీచర్ వాసుదేవన్ సతీమణికి ఆర్ఎంపీ వైద్యుడు రమేష్ కు మధ్య కొంత కాలంగా ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వాసుదేవన్ భార్య రమాదేవితో పాటు ఆమె ప్రియుడు ఆర్ఎంపి వైద్యుడైన రమేష్ ను పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
వివాహేతర సంబంధంతో హత్య
వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకొంది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన వాసుదేవన్ కొత్తూరు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతని భార్య రమాదేవికి ఆర్ఎంపీ వైద్యుడు రమేష్కు సంవత్సరకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి వాసుదేవన్ పద్దతిని మార్చుకోవాలని ఆర్ఎంపీ వైద్యుడు రమేష్ను హెచ్చరించాడు. అంతేకాదు భార్య రమాదేవిని కూడ ఈ విషయమై మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి భర్తను ఆమె హత్య చేయించిందని పలమనేరు డీఎస్పీ చౌడేశ్వరీ చెప్పారు.
ఆ మూడు నెలలు వారి మధ్య బ్రేక్
తన భార్యతో ఆర్ఎంపీ వైద్యుడు రమేష్కు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని గుర్తించిన వాసుదేవన్ ఇద్దరిని మందలించాడు. ఆ తర్వాత వీరిద్దరూ కూడ కలుసుకోకుండా కట్టుబటాట్లను విధించాడు. దీంతో వీరిద్దరూ మూడు మాసాల పాటు కలుసుకోలేకపోయారు. తమ మధ్య బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని వారు భావించారు. భర్త అడ్డు తొలగించుకొంటేనే తమ మధ్య సుఖానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించారు.
భర్త హత్యకు భార్య ప్లాన్
వాసుదేవన్ తన సోదరి ఇంటికి మే 12వ తేదిన వెళ్ళాడు. బంగారు పాల్యం మండలంలోని బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి తన టూ వీలర్పై వస్తున్న సమయంలో వడ్డివాని చెరువు సమీపంలో సుమోతో వాసుదేవన్ ను రమేష్ ఢీకొట్టి చంపేశాడు. తీవ్ర గాయాలతో పారిపోతున్న వాసువేదవన్ ను రమేష్ మరోసారి సుమోతో ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు. అయితే తన భర్త ఎక్కడ ఉన్నాడు , ఏ దారిలో వస్తున్నాడనే సమాచారాన్ని ప్రియుడికి భార్య రమాదేవి అందించిందని పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ చేసిన పోలీసులు
వాసుదేవన్ మరణించిన తర్వాత ప్రియుడు రమేష్ ను వివాహం చేసుకొనేందుకు రమాదేవి ప్లాన్ చేసుకొన్నారు. ప్రియుడు రమేష్ తో కలిసి రమాదేవి పారిపోతుండగా కేజీ సత్రం బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.