ఇలాగే ఉంటాం, అలా అన్లేదు: బొజ్జల, ఎర్రచందనం కీలక అనుమానితుల అరెస్ట్!
హైదరాబాద్: ఎర్రచందనం దొంగల విషయంలో తమ విధానం ఇలాగే ఉంటుందని, శేషాచలం ఎన్కౌంటర్ విషయంలో తాను అంతం కాదు ఆరంభం అంటూ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ఆదివారం అన్నారు.
శేషాచలం ఎన్కౌంటర్లో మృతి చెందిన వారి వద్ద నుండి తాము సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సదరు సెల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో అడవులను రక్షించేందుకు రూ.100 కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు.

శేషాచలం ఎదురు కాల్పుల ఘటన పైన చట్ట ప్రకారం విచారణ చేపడతామన్నారు. ఎర్ర చందనం వేలం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశముందని చెప్పారు. ఇలా వచ్చిన ఆదాయంలో తిరిగి ఎర్ర చందనం సంరక్షణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తామన్నారు.
ఎర్రచందనం కీలక అనుమానితుడు అదుపులో?
శేషాచలం ఎన్కౌంటర్ కేసులో కీలక అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన కూలీల వద్ద దొరికిన సెల్ ఫోన్ చిట్టా ఆధారంగా వారు కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications