పిల్లలతో సహా రైలు కింద పడి తల్లి ఆత్మహత్య...శ్రీకాకుళం జిల్లాలో విషాదం
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వేస్టేషన్లో గురువారం ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదుకాని ఓ తల్లి తన కూతురుతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
భువనేశ్వర్ నుంచి బెంగళూర్ వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఆముదాలవలస సమీపంలో చేరుకోగానే ఆ తల్లి తన కుమార్తెతో సహా రైలు కింద పడింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతులకు సంబంధించిన ఆధారాలేవీ దొరకలేదని జిఆర్పి పోలీసులు చెబుతున్నారు.
తల్లికి సుమారు 30 ఏళ్లు ఉంటాయని పాపకు 3 సంవత్సరాల వయస్సు ఉండొచ్చని జిఆర్పి పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు, కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
andhra pradesh srikakulam mother daughter died train accident ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం తల్లి కుమార్తె ఆత్మహత్య రైలు
English summary
In the Sikakulam district A mother aged around 30 and daughter (3) who died after being hit by a train near at Amudalavalasa, Srikakulam district on today.