గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియుడిని చంపి సెప్టిక్ ట్యాంకు లో పూడ్చేసిన ప్రియురాలు

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం ఎన్ఠీఆర్ కరకట్ట మీద దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత అక్రమ సంబంధం నేపథ్యం లో ఈ దారుణ ఘటన కు పాల్పడింది. తాడేపల్లి కి చెందిన వివాహిత గాయత్రి విజయవాడ లోని పడమట లో ఓ ప్రవేట్ కంపెనీ లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంది.

గాయత్రికి గతం లో పెళ్లి అయ్యింది. భర్త చనిపోగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపధ్యం లో విజయవాడ లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. ఈ క్రమంలోనే గాయత్రికి అదే కంపెనీ లో పని చేస్తున్న రాజయ్య, సుధాకర్ అనే వ్యక్తులతో సన్నిహిత సంభందాలు ఉన్నాయి.

Woman kills her lover at Tadepalligudem

పోలీసులు ప్రాధమిక సమాచారం ప్రకారం గాయత్రి రాజయ్య, సుధాకర్ ఇద్దరు తో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యం లో వారు పని చేస్తున్న కంపెనీ లో పర్మినెంట్ గా పని చేసేందుకు ఆటో డ్రైవర్ పోస్ట్ ఉంది. ఈ పోస్టు లో రాజయ్య అనే వ్యక్తి కొనసాగుతుండగా, ఆ పోస్ట్ రాజయ్య కు పర్మినెంట్ అవుతుంది అని భావించిన గాయత్రి,సుధాకర్ లు రాజయ్య ను అడ్డుతొలగించాలని పధకం పన్నారు.

అనుకున్నదే తడవు గా రాజయ్యను తాడేపల్లి లో గల గాయత్రి ఇంటి వద్ద పధకం ప్రకారం చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంకు లో పూడ్చి వేశారు. ఇది జరిగి సుమారు నెలరోజులు కావస్తోంది.

ఇది ఇలా ఉంటె, నెల క్రితం విజయవాడ లో రాజయ్య మిస్సింగ్ కేసు నమోదు అయింది. నెల రోజులు గా విచారణ చేపట్టిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టగా పోలీసులకు ప్రాధమిక వివరాలు తెలిశాయి. ప్రస్తుతం తాడేపల్లి లో గాయత్రీ ఇంటివెనుక సెప్టిక్ ట్యాంకు లో ఉన్న రాజయ్య మృత దేహాన్ని బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ లోని పడమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman Gayatri has killed her lover Rajaiah at Tadepalligudem of Gutur disrist in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X