గృహిణితో, ఫ్రెండ్తో వివాహేతర సంబంధం: భర్త హెచ్చరిక, ఆత్మహత్య
హైదరాబాద్: భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని మహిళ ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాదులో జరిగింది. విషం తాగిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అతని పరిస్థితి విషమంగా ఉంది.
పాత రామంతాపూర్కు చెందిన రాజ్ కుమార్ (27)కు అంబర్ పేటలోని ఓ గృహిణితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే పరిచయమైన ఆమె స్నేహితురాలు (30)తోను అతడు వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు.
భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్న విషయాన్ని మొదటి గృహిణి భర్త గుర్తించాడు. ఆమెను హెచ్చరించాడు. దీంతో, సదరు మహిళ, ప్రియుడు రాజ్ కుమార్ రామంతాపూర్లోని ఓ ప్రాంతానికి గురువారం రాత్రి చేరుకున్నారు.
అక్కడ ఆత్మహత్యాయత్నం చేశారు. వారు తమ వెంట తెచ్చుకున్న విషాన్ని తాగారు. స్థానికులు గుర్తించి వారినని పోలీసులకు సమాచారం అందించారు. వారిని ఆసుపత్రికి తరలించారు. గృహిణి (ప్రియురాలు) మృతి చెందింది. రాజ్ కుమార్ పరిస్థితివిషమంగా ఉంది.