69 ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి.. : వైఎస్ జగన్ ఘనతంటూ యనమల తీవ్ర విమర్శలు
అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం వల్లే రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని అన్నారు.

69ఏళ్ల చరిత్రలో..
కోర్టు బోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనత సాధించారని యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. 63ఏళ్ల చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ రాష్ట్రానికి ఇంత చెడ్డ పేరు తీసుకురాలేదని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను, అధికారులను కూడా జగన్ జైలుకు తీసుకెళ్లడం ఖాయమని అన్నారు.

ప్రజలను రోడ్డునపడేశారు..
ఒక వైపు ఆందోళనలతో రాష్ట్ర మండిపోతుంటే వీడియో గేముల్లో ముఖ్యమంత్రి, కోడి పందేల్లో మంత్రులు మునిగిపోతున్నారని యనమల విమర్శించారు. సీఎం, మంత్రులు నీరో చక్రవర్తిని మించిపోయారని దుయ్యబట్టారు. మూడు రాజధానులంటూ ప్రజలందర్నీ రోడ్డున పడేశారని మండిపడ్డారు.

600 కోట్ల పేదల కానుకలు ఎగ్గొట్టారు..
అన్న క్యాంటీన్లు, సంక్రాంతి కానుకలు, తదితర పథకాలను రద్దు చేసి, పేదల నోటికి కాడి ముద్దను లాగేశారని యనమల ధ్వజమెత్తారు. పండగ కానుకలు ఎగ్గొట్టి పేదలకు రూ. 600 కోట్ల నష్టం చేసిందని జగన్ సర్కారుపై మండిపడ్డారు. అక్కలు, అమ్మలు, చెల్లెమ్మలంటూ వాళ్లపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలపైనా దాడులు చేయిస్తూ..
తెనాలిలో మహిళలపై దాడి చేయడం దారుణమని.. దుర్గ గుడికి వెళ్లే మహిళలను అడ్డుకుని దాడులు చేస్తారా? అంటూ యనమల మండిపడ్డారు. విజయవాడలో మహిళలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళా కమిషన్ సుమోటాగా కేసు పెట్టినా వైసీపీకి సిగ్గులేదని విమర్శించారు.

మానవ హక్కుల ఉల్లంఘనలు..
మానవ హక్కులను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎస్సీల ఆత్మహత్యలపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని యనమల తెలిపారు. విద్యార్థులను బయటకు పంపొద్దని కళాశాలలకు నోటీసులిచ్చారని దుయ్యబట్టారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై లాఠీఛార్జీ చేయడం అమానుషమని అన్నారు. అమరావతిలో రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున రైతులు, ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications