Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహాకూటమికి వెయ్యి కోట్లా? చంద్రబాబే ఫైనాన్షియరా?

తెలంగాణ ఎన్నికల సెగ ఏపీకి తాకింది. అక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ ప్రకంపనలు మొదలయ్యాయి. తాజాగా మహా కూటమిలో చేరిన టీడీపీ ఎన్నికల ఖర్చునంతా తానే భరిస్తోందంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే ఓటుకు నోటు కేసు చంద్రబాబుకు చుట్టుకుని ఉన్న తరుణంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి.

కూటమి అభ్యర్థులందరికీ చంద్రబాబు ఫైనాన్షియర్ గా మారాడని చెప్పడానికి ఇటీవల అమరావతిలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఆయనతో సమావేశం కావడమే నిదర్శనమని హాట్ కామెంట్ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి.

ycp leader vijayasai reddy hot comments on chandra babu

మహాకూటమికి వెయ్యికోట్లు ఇచ్చేలా చంద్రబాబు డీల్ కుదుర్చుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు విజయసాయి రెడ్డి. ఇంత పెద్ద మొత్తం పాలు, కూరగాయలు అమ్మితే వచ్చిన డబ్బులు కాదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై విజయసాయి రెడ్డి చేసిన మరో ట్వీట్ కూడా హాట్ టాపిక్ గా మారింది. 'వెయ్యిగొడ్లను తిన్న రాబంధు ఒక్క గాలివానకు కుప్పకూలుతుంది. పింగళి దశరథ రామ్‌ను, రాఘవేంద్ర రావును, మల్లెల బాబ్జీని, వంగవీటి రంగాను చంపించిన, ఇంకా ఎంతోమంది హత్యలకు పథక రచన చేసిన ముఠా అప్పుడు తప్పించుకోవచ్చు. కానీ జననేత వైఎస్‌ జగన్‌ హననానికి ప్రయత్నించిన కోడికత్తి ముఠా ఇప్పుడు తప్పించుకోలేదు' అని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+