ఏపీలో వైసీపీ మాస్కుల కలకలం ... రాజకీయ పార్టీలు కరోనాను వాడుకుంటున్నారుగా !!
ఏపీలో రాజకీయ నాయకులు ప్రచారానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదలటం లేదు . తాజాగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో కరోనాకు మాస్కులు అందిస్తున్నారు . అంతవరకు బాగానే ఉన్నా వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో మాస్కులను ఇవ్వటం ఏపీలో రాజకీయ దుమారం రేపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతున్న తరుణంలో ఏపీలో వైసీపీ శ్రేణులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.
మనీలాలో చిక్కుకున్న వారిని తీసుకురండి .. కేంద్ర విదేశాంగమంత్రికి చంద్రబాబు లేఖ
పార్టీ ప్రచారానికి కరోనా నియంత్రణా మాస్కులను తయారు చేసిన వైసీపీ
ఒకవైపు కరోనా, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వర్గాలు తమ పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పుడు ఎన్నికలు ఆగిపోయినా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్న కారణంగా మాస్కులను అందిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించి తిరిగే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. చాలా చోట్ల మాస్కుల కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇక దీన్ని కూడా వాడుకోవాలనుకున్న వైసీపీ నేతలు కొత్త ఆలోచన చేశారు .
స్థానిక ఎన్నికల టార్గెట్ గా వైసీపీ మాస్కులు
ఇక ఈ సమయంలో ఏపీలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. కరోనా నియంత్రణా చర్యలు శరవేగంగా కొనసాగుతుంటే కరోనా భయం దూరం చేసి , రక్షణకు మాస్కులు ఇవ్వాలని భావించిన వైసీపీ నాయకులు వైసీపీ మాస్కులను తయారు చేయించి అందిస్తున్నారు . స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగి వుంటే.. కరోనా నేపథ్యంలో మాస్కులను ఇవ్వాలని భావించి ప్రచారం కోసం వైసీపీ రంగులు, వైసీపీ ఎన్నికల గుర్తు అయిన ఫ్యాన్ ను , వైసీపీ అధినేత జగన్ ఫోటో కలిపి కరోనా మాస్కులను రూపొందించారు.
Recommended Video
కరోనా వైరస్ నియంత్రణా మాస్కులను కూడా వాడుకుంటున్న వైసీపీ
వాటిని పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని భావించి ఈ తరహా ప్రయోగం చేశారు . కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కులు ధరించాలన్న డాక్టర్ల సూచనను వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పలు ప్రాంతాల్లో వైసీపీ మాస్కులను పంచిపెడుతున్నట్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ప్రాణాంతక కరోనా వైరస్ ను కూడా రాజకీయ నాయకులు తమ పార్టీ ప్రచారం కోసం వాడుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తుంది.