నామినేషన్లు వేయటానికి దమ్ము లేదు కానీ ఆ సత్తా ఉందా ? టీడీపీకి వైసీపీ మంత్రి అనిల్ సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ మంత్రులు ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీదే పై చేయి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం మాకే సొంతమంటూ ధీమా వ్యక్తం చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై , చంద్రబాబుకు సహకరిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీలకు ఎన్నికల విషయంలో సవాల్ విసిరారు.
అధికారులకు నిమ్మగడ్డ బ్లాక్ మెయిల్ , చంద్రబాబుకు ఎస్ఈసి బంట్రోతు : మంత్రి పెద్దిరెడ్డి ఫైర్
నామినేషన్లు వేయడానికి దమ్ము లేదు కానీ చంద్రబాబు చిల్లర రాజకీయాలు
నామినేషన్లు వేయడానికి దమ్ము లేదు కానీ ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. నేడు కర్నూలులో మీడియాతో మాట్లాడిన మంత్రి రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పూర్తిస్థాయిలో సత్తా చాటబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కనీసం నామినేషన్ వేసేశక్తి, ధైర్యం లేని పార్టీలు ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పుకుంటున్నాయి అని ఎద్దేవా చేశారు.
ప్రధాన ప్రతిపక్షం 25% సీట్లను, ఇక తోక పార్టీలు 5 శాతమైనా సీట్లను సాధించే దమ్ముందా ?
ఎన్నికల్లో మాదే విజయం అని చెప్పుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం 25% సీట్లను, ఇక తోక పార్టీలు 5 శాతమైనా సీట్లను సాధించే సత్తా ఉందా? అంటూ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.
విజయ డైరీ ఎన్నికల్లో 80% ఓట్లతో గెలిచామని, పంచాయతీ ఎన్నికల్లోనూ 80 శాతం సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో వైసిపి సత్తా చూపిస్తామని ప్రకటించారు.
రికార్డులను బ్రేక్ చేయడం , ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం మాకే సొంతం
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే రేపటి ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరుస్తాయని, వైసీపీ విజయానికి నిదర్శనం అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రికార్డులను బ్రేక్ చేయడం , ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేయడం తమకే సాధ్యమవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నంద్యాల విజయ డైరీ డైరెక్టర్ చైర్మన్ ఎన్నిక విషయంలో భారీ మెజారిటీతో గెలుపొందటానికి కృషిచేసిన నంద్యాల పార్లమెంట్ ఎమ్మెల్యేలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఎన్నికలు ఏవైనా విజయం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.