ఉప ఎన్నికలు జరిగుంటే...వైసిపి అభ్యర్థులు చిత్తుగా ఓడేవారు:చంద్రబాబు
అమరావతి:భాజపా, ఆ పార్టీతో కుమ్మక్కైన వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్లేషించారు. కుట్ర రాజకీయాలపై పార్టీ కార్యకర్తల్లో, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తిరుపతి టిడిపి నేతల సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బుధవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో అన్ని స్థానాలు మనమే గెలుస్తామన్నారు.

ఎన్నికలు జరిగుంటే...ఓడిపోయేవారు
వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసిన అయిదు పార్లమెంటు స్థానాలకు ఉపఎన్నికలు జరిగి ఉంటే ఆ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయేవారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన టిడిపి ముఖ్య నేతలతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలు జరగలేదు కాబట్టి వైసిపికి గుణపాఠం చెప్పే అవకాశం రాలేదన్నారు. ఈ సమావేశంలోమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, బీదా రవిచంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

భాజపా,వైకాపాపై...వ్యతిరేకత
బిజెపి, ఆ పార్టీతో కుమ్మక్కైన వైకాపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. వారి కుట్ర రాజకీయాలపై కార్యకర్తల్లో అవగాహన పెంచాలని...ప్రజల్ని చైతన్యపరచాలని చంద్రబాబు ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నేతలకు సూచించారు. ప్రజలు కూడా కుట్ర రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారని...పార్టీ నేతలు చేయాల్సిందల్లా వాస్తవాలు తెలియజెప్పడమే అన్నారు.

టిడిపి...బలం పెరిగింది
గతంలో కంటే క్రైస్తవ, ముస్లిం మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీలలో తెలుగు దేశం పార్టీ బలం పెరగడం సానుకూల పరిణామమన్నారు. దీన్ని పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రజల్ని మెప్పించడంలోనే ఏ నాయకుడి సామర్థ్యమైనా బయటపడుతుందని, అదే ముఖ్యం అన్నారు. పార్టీ కార్యకర్తలకు నాయకులు పూర్తి సమయం కేటాయించాలని చంద్రబాబు హెచ్చరించారు.

తిరుపతి...అద్భుత భవిష్యత్తు
తిరుపతి పార్లమెంటు సీటును చివరి నిమిషంలో భాజపాకి ఇవ్వడం వల్ల 2014 ఎన్నికల్లో దెబ్బతిన్నామని, నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తెదేపా గెలిచినా, ఎంపీ సీటు కోల్పోవడానికి అభ్యర్థి ఖరారులో జరిగిన జాప్యమే కారణమని చంద్రబాబు విశ్లేషించారు. పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటుతో పాటు, ఏడు శాసనసభ స్థానాలను గెలుస్తామని చంద్రబాబు చెప్పారు. తిరుపతికి అద్భుతమైన భవిష్యత్తు ఉందన్నారు. దేశంలోనే నెం.1 నియోజకవర్గంగా తిరుపతి రూపొందుతోందని తెలిపారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications