Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉన్నత చదువులు: 20 ఏళ్లకే ఎన్నికల్లో గెలిచిన గర్ల్స్

హైదరాబాద్: ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో యువత కూడా సత్తా చాటింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో సత్తా చాటడం గమనార్హం. బద్వేలు జెడ్పీటీసీగా టిడిపి తరఫున పోటీ చేసిన చార్టర్డ్ అకౌంటెండ్ (సిఏ) విద్యార్థిని శిరీష.. 317 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

గోపవరం మండలం కాలువలల్లె నుంచి ఎంపీటీసీగా బరిలో నిలిచిన టిడిపి అభ్యర్థిని శిరీష కుమారి... 170 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వీరిద్దరు వయస్సు అటు ఇటు ఇరవయ్యే.

తమ గెలుపు పైన ఉత్సాహంతో ఉన్న వారు మాట్లాడుతూ... యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ వయస్సులో ఉన్నప్పుడు వస్తేనే ప్రజలకు ఏదైనా చేయగల్గుతామన్నారు. తమను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలిపారు.

 Young girls win in Seemandhra region.

కాగా, తూర్పు గోదావరి జిల్లా కడియం మండల కేంద్రం నుంచి జిల్లా ప్రాదేశిక సభ్యురాలు (జడ్‌పీటీసీ)గా బీటెక్ విద్యార్థిని పాలపర్తి రోజా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన రోజా చిన్న వయసులోనే జడ్‌పీటీసీగా గెలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే.

పైగా, తన ప్రత్యర్థి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ఉల్లింకల విజయలక్ష్మిపై 14,247 ఓట్ల మెజారిటీ సాధించారు. విద్యావంతురాలిగా మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచీ ఆమె చేస్తూ వచ్చారు. దీంతో 14 గ్రామాల ప్రజలు రోజాకు జడ్పిటీసి హోదా కట్టబెట్టారు. యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదంతో తాను ఎన్నికల్లో పోటీ చేశానంటున్న రోజా తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాలనతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+