వైయస్కు జగన్ నివాళి: విజయమ్మ కంటతడి(పిక్చర్స్)
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైయస్ 65వ జయంతి వేడుకలు కడప జిల్లాలోని ఇడుపులపాయలో జరిగాయి.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డితోపాటు వైయస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, కోడలు భారతి, షర్మిల కుమార్తె అంజలి, కడప ఎంపి వైయస్ అవినాశ్ రెడ్డి వైయస్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు.
వీరితోపాటు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి, ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే వైయస్ పురుషోత్తమరెడ్డి, జగన్ మామ ఈసి గంగిరెడ్డి, వైయస్ ప్రకాశ్ రెడ్డి, కమలమ్మ, వైయస్ ప్రమీలమ్మ, వైయస్ అవినాశ్ రెడ్డి సతీమణి సమతారెడ్డి, తదితరులు ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెవరెండ్ నరేష్ బాబు వైయస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

వైయస్కు నివాళి
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

వైయస్కు నివాళి
వైయస్ 65వ జయంతి వేడుకలు కడప జిల్లాలోని ఇడుపులపాయలో జరిగాయి. నివాళులర్పిస్తున్న విజయమ్మ.

వైయస్కు నివాళి
వైయస్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డితోపాటు వైయస్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, కోడలు భారతి, షర్మిల కుమార్తె అంజలి, కడప ఎంపి వైయస్ అవినాశ్ రెడ్డి వైయస్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు.

వైయస్కు నివాళి
వైయస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైయస్ ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం విజయమ్మ కంటతడి.












Click it and Unblock the Notifications