వరదల వేళ జగన్ కీలక నియామకాలు - విజయవాడ కేంద్రంగా..!!
విజయవాడలో వరద పెను విషాదం మిగిల్చింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోస్తరు వర్షం కొనసాగుతోంది. పలువురు ముంపు బాధితులకు అండగా నిలుస్తున్నారు. వైసీపీ కోటీ రూపాయల ఆర్దిక సాయం ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ తో సహా పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ వైఫల్యం
వరదలతో విజయవాడ అతలాకుతలం అయింది. బాధితులకు అండగా నిలిచేందుకు జగన్ పార్టీ నేతలతో సమీక్ష చేసారు. పార్టీ నుంచి కోటీ రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పార్టీ నుంచి నేతలతో టీంలు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆ తర్వాత స్థానిక అవసరాలు గుర్తించి, పార్టీ నుంచి సాయం అందిస్తామని ఆయన తెలిపారు.

సమీక్ష చేసారా
వరద అంచనా...సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తమ మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు..కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ఈ వరదలు మానవ తప్పిందంగా పేర్కొన్నారు. గతంలో వరదల సమయంలో ఎలా వ్యవహరించిందీ గుర్తు చేసారు. భారీ వర్షాలు, వరదలపై ముందే సమాచారం ఉన్నా, కనీసం సమీక్ష అయినా జరిపారా అంటూ నిలదీసారు. పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వరద తగ్గించి, ఫ్లడ్ వాటర్ కుషన్ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని ప్రశ్నించారు.
వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షులను ఈరోజు నియమించడం జరిగింది. pic.twitter.com/mwL8nurmJt
— YSR Congress Party (@YSRCParty) September 3, 2024
పార్టీ నియామకాలు
ఇదే సమయంలో పార్టీ నియామకాలను ప్రకటించారు.అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ను నియమించిన జగన్...రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మార్గాని భరత్ పేరు ఖరారు చేసారు. మరిన్ని నియామకాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!!












Click it and Unblock the Notifications