అందుకే కష్టాలు వస్తాయని అబ్దుల్ కలాం చెప్పారు: జగన్
విజయవాడ: దివంగత, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా బుధవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.
అబ్దుల్ కలాం ఆలోచనలు, దూరదృష్టి భారత దేశానికి ఉపయోగపడ్డాయని, అతని ఆలోచనలు ఇంకా సజీవంగా ఉన్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైయస్ జగన్ కూడా అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

కలాం చెప్పిన మాటలను జగన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా గుర్తు చేసుకున్నారు. మనలను మనం మరింత శక్తిమంతులుగా రూపుదిద్దుకోవడం కోసమే కష్టాలు వస్తాయని కలాం చెప్పేవారన్నారు. కలాం తన ఆలోచనలు, చర్యలతో భారత్ని బలోపేతం చేశారన్నారు. కలాం నడిచిన బాటలోనే మనం నడిస్తే అది ఆయనకు మనమిచ్చే ఉత్తమమైన శ్రద్ధాంజలి అన్నారు.
కాగా మిస్సైల్ మ్యాన్గా పేరొందిన అబ్దుల్ కలాం గతేడాది జులై 27న షిల్లాంగ్లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications