YS Jagan Delhi Tour : రేపు మళ్లీ ఢిల్లీకి జగన్-రెండు వారాల వ్యవధిలో రెండోసారి..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈసారి టూర్ అజెండా ఏంటో పూర్తిగా తెలియకపోయినా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ టూర్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 17న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్.. ఇప్పుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత రెండు వారాల్లో సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించబోతుండటం ఇది రెండోసారి. దీంతో ఈ టూర్ లో జగన్ ఎవరెవరిని కలవబోతున్నారు, ఏం చర్చించబోతున్నారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

నిన్న సీఎం జగన్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. ఇందులో పలు కీలక అంశాల్ని ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ బడ్డెట్ తో పాటు పలు అంశాలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ టూర్ కు జగన్ బయలుదేరనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ టూర్ లో జగన్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ వరకూ లభించినట్లు తెలుస్తోంది. మిగతా అపాయింట్ మెంట్ల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
-
మీ అవగాహన ఇంతేనా ? చంద్రబాబుకు బుగ్గన ఘాటు కౌంటర్..! -
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications