YS Jagan Delhi Tour : రేపు మళ్లీ ఢిల్లీకి జగన్-రెండు వారాల వ్యవధిలో రెండోసారి..!
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈసారి టూర్ అజెండా ఏంటో పూర్తిగా తెలియకపోయినా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులతో జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ టూర్ కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 17న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జగన్.. ఇప్పుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత రెండు వారాల్లో సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించబోతుండటం ఇది రెండోసారి. దీంతో ఈ టూర్ లో జగన్ ఎవరెవరిని కలవబోతున్నారు, ఏం చర్చించబోతున్నారనే అంశం ఉత్కంఠ రేపుతోంది.

నిన్న సీఎం జగన్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. ఇందులో పలు కీలక అంశాల్ని ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ బడ్డెట్ తో పాటు పలు అంశాలు వీరిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీ టూర్ కు జగన్ బయలుదేరనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ టూర్ లో జగన్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ వరకూ లభించినట్లు తెలుస్తోంది. మిగతా అపాయింట్ మెంట్ల కోసం ఇంకా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications