పబ్లిసిటీ వస్తుందంటే చంద్రబాబు 5 లక్షలిస్తాడు, నా భయమే!: జగన్
అనంతపురం: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్రను మంగళవారం చేపట్టారు. బుధవారం యాత్ర కొనసాగుతోంది.
ఉదయం ఆయన కళ్యాణదుర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం భరోసా యాత్రను ప్రారంభించారు.
నేరుగా బ్రహ్మ సముద్రం మండలం పొబ్బర్లపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత ముదిగల్లు చేరుకొని అక్కడి నుండి బోయనారాయణప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. వర్ణిలో గంగన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర
మంగళవారం నాడు రైతు భరోసా యాత్రలో జగన్ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు. ప్రచారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడన్నారు. పుష్కరాల ప్రమాద ఘటన అలాగే జరిగిందని ఆరోపించారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు, మాట్లాడేది అంతా మోసమే అన్నారు. పబ్లిసిటీ వస్తుందంటే రూ.5 లక్షల పరిహారం ఇస్తానంటారని ఆరోపించారు. లేదంటే రైతుల ఆత్మహత్యలే జరగలేదంటారన్నారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర
జగన్ వస్తున్నారంటే హడావుడిగా పరిహారం ప్రకటిస్తాడని, లేదంట ఇవ్వడని అన్నారు. ప్రచారం కోసం పుష్కరాల్లో షార్ట్ ఫిల్మ్ తీసి 27 మందిని బలి తీసుకున్నాడని ఆరోపించారు.

వైయస్ జగన్ భరోసా యాత్ర
రైతులు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చెప్పారని, అపరాధ వడ్డీ కూడా సరిపోని విధంగా రుణమాఫీ వర్తింప చేశారన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సి ఉందన్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications