మీరు ఎవరిని డిసైడ్ చేస్తే వారే ఇక.. జగన్ కీలక నిర్ణయం..!!
మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం దిశగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా అనుబంధ సంఘాల నేతలకు కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక నుంచి తాను కార్యకర్తలతో మమేకవ్వాలని జగన్ నిర్ణయించారు. ఇందు కోసం త్వరలోనే సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. అదే సమయంలో చంద్రబాబు పాలన పైన జగన్ ధ్వజమెత్తారు. ఫీజు బకాయిలు.. మెడికల్ కాలేజీల విషయంలో పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. గుగూల్ క్రెడిట్ ను చంద్రబాబు చోరీ చేసారని జగన్ ఆరోపించారు.
వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కీలక దిశా నిర్దేశం చేసారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ వాయిస్ గా మారి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించారు. మీరు ఎవరిని డిసైడ్ చేస్తే వారే అధికారంలోకి వస్తారని వ్యాఖ్యానించారు. గుగూల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల విషయంలో చెడు చేస్తున్నారని విమర్శించారు. మనకు ఇతర రాష్ట్రాల్లోనే పోటీ కాదని.. పోటీ ప్రపంచతోనే అని చెప్పుకొచ్చారు. అత్యుత్తమ యూనివర్సిటీ కి చెందిన కోర్సులు అందుబాటులోకి తెచ్చామన్నారు. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకొని వచ్చామని చెప్పారు. చంద్రబాబు పాలనలో ఫీజు రీయంబర్స్ మెంట్ రూ 4,200 కోట్లు పెండింగ్ లో ఉందని వివరించారు. వసతి దీవెన కింద రూ 2,200 కోట్లు పెండింగ్ ఉందని చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగామని జగన్ చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేసామని... ఆరోగ్య రంగంలో భారీగా ఉద్యోగాలు ఇచ్చామని వివరించారు. కాగా, ఇప్పుడు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నారని విమర్శించారు. ఇక.. గుగూల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేసారని జగన్ విమర్శించారు. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకు వచ్చేలా అంకురార్పణ చేసింది వైసీపీ ప్రభుత్వంలో అని చెప్పారు. ఆదానీ - గుగూల్ లో 2022 లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని గుర్తు చేసారు. వైసీపీ హయాంలోనే అన్ని ఏర్పాట్లు జరిగాయని.. ఈ కారణంగానే గుగూల్ వస్తుందన్నారు. మూల పేట నుంచి కట్టుకుంటూ వెళ్లామని వివరించారు. భోగాపురం విమానాశ్రయానికి అన్ని అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా నిర్మాణాలు చేసామని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ సరి కాదన్నారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకం గా ర్యాలీలు 11వ తేదీ నుంచి 12వ తేదీకి మార్పు జరిగిందని వెల్లడించారు. డిసెంబర్ లో ఫీజు రీయంబర్స్ మెంట్ పై ఆందోళనలు ఉంటాయని జగన్ స్పష్టం చేసారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications