జగన్ భారీ ప్లాన్, ఇక నేరుగా- ముహూర్తం, నియోజకవర్గాలు ఫిక్స్..!!
ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి నేతలు తామే 15 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమాగా చెబుతున్నారు. ఇటు మాజీ సీఎం జగన్ కూటమి పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని విమర్శిస్తున్నారు. దీంతో.. 2027 లో పాదయాత్ర కు డిసైడ్ అయిన జగన్.. ఈ లోగానే పార్టీ కేడర్ వద్దకే వెళ్లి మమేకం అవ్వాలని నిర్ణయించారు. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటన కు ముహూర్తం పిక్స్ చేసారు.
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పార్టీ కేడర్ తో నాయకత్వానికి వచ్చిన గ్యాప్ గురించి గుర్తించారు. దీంతో.. ప్రతీ సందర్భంలోనూ ఈ సారి పార్టీ కేడర్ కే తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ చెబుతూ వస్తున్నారు. కాగా.. ఏ ఏడాది జనవరి నుంచే జగన్ జిల్లాల పర్యటనలు చేసి.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో వారంలో రెండు రోజులు కేడర్ తో ఉంటానని ప్రకటించారు.

అయితే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి అప్పటికి ఆరు నెలలే కావటం తో నిర్ణయం వాయిదా వేసుకున్నారు. ఇక.. ఇప్పుడు రానున్న జనవరి 26వ తేదీ నుంచి జగన్ జిల్లాల వారీగా బస్సు యాత్రకు సిద్దం అయినట్లు సమాచారం. ఈ బస్సు యాత్ర ద్వారా దాదాపు 60 నియోజకవర్గాల్లో జగన్ పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజా సమస్యల పైన జగన్ స్పందించేలా కార్యక్రమం సిద్దం అవుతోంది.
ఇక.. 2029 ఎన్నికల కోసం జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. 2027 జూలై నుంచి పాదయాత్ర -2 కు సిద్దం అవుతున్నారు. ముందుగా పార్టీ కమిటీలు.. ఇంఛార్జ్ నియామకం పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. జనవరి నుంచి బస్సు యాత్రగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో తొలి విడతగా కేడర్ తో సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకోవటం తో పాటుగా పార్టీలో కార్యకర్తల వాయిస్ వినిపించేందుకు వీలుగా కొత్త యాప్ ను ఆవిష్కరించేలా తాజా గా కసరత్తు ప్రారంభించారు.
దాదాపు నాలుగు నెలల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. జూలై లో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాత్ర ద్వారా పార్టీ కేడర్ కు తిరిగి జగన్ దగ్గర కావటంతో పాటుగా స్థానికంగా ఉన్న వివిధ వర్గాల వారితోనూ సమావేశాలు నిర్వహించనున్నారు. దీని ద్వారా కేడర్ ను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయటం.. స్థానికంగా పార్టీని బలో పేతం చేయటమే లక్ష్యంగా జగన్ సమావేశాలకు సిద్దం అవుతున్నారు. ఈ నిర్ణయం రాజకీయంగా కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications