Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈవీఎంలపై దేశవ్యాప్తంగా ఆందోళన- రాజ్యాంగ దినోత్సవం వేళ జగన్ కీలక ట్వీట్..!

ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యాక అందుకు కారణాల్ని వెతికే క్రమంలో ఈవీఎం పనితీరుపై తొలిసారి ప్రశ్నలు వేయడం మొదలుపెట్టిన మాజీ సీఎం వైఎస్ జగన్ దాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరోసారి ఈవీఎంల పనితీరుపై ప్రశ్నలు, బ్యాలట్ పేపర్ల వాడకాన్ని గుర్తుచేస్తూ జగన్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇందులో దేశవ్యాప్తంగా ఈవీఎంలపై ఆందోళన పెరుగుతోందన్నారు.

మన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రిపబ్లిక్ మనకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి హామీ ఇస్తుందని జగన్ తెలిపారు. మనం 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, దాని ప్రాముఖ్యతను ప్రతిబింబించాలని, దాని మార్గదర్శక సూత్రాలకు మన అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిద్దామని జగన్ పిలుపునిచ్చారు.
అదే సమయంలో ఈవీఎల పనితీరును జగన్ ప్రశ్నించారు.

ys jagan questions usage of evms across the country on constitution day in a tweet

ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఈవీఎంల పనితీరు గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న ఆందోళన ఈవీఎంల యొక్క వాస్తవికతను ప్రశ్నించడానికి,, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ దేశాలలో ఉన్న పద్ధతిలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలకు ఎందుకు వెళ్లకూడదని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలని కోరారు.

ఇటీవలి కాలంలో మన దేశ పౌరులకు హామీ ఇచ్చిన అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేయడానికి దూకుడుగా జరుగుతున్న ప్రయత్నాలూ ఆందోళన కలిగిస్తున్నాయని జగన్ తెలిపారు. ఈ పవిత్రమైన రోజున డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, మన రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనిక నాయకులు, ఏకీకృత, సమాన భారతదేశం వైపు నడిపించారంటూ జగన్ గుర్తుచేసుకున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+