కత్తితో దాడి: వైయస్ జగన్ ఏమన్నారంటే..?
హైదరాబాద్: తన కోసం ఆందోళన ఎవరూ ఆందోళన చెందవద్దని, తాను సురక్షితంగానే ఉన్నానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. దేవుడి దయ, మీ అభిమానంతో తనకు ఏమీ జరగలేదని వ్యాఖ్యానించారు.
To everyone worried about my safety - I’d like to inform you that I am safe. God's grace and the love, concern & blessings of the people of Andhra Pradesh will protect me. Such cowardice acts will not dissuade me but only strengthen my resolve to work for the people of my state!
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 25, 2018
విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డిపై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
విశాఖ ఎయిర్పోర్టులో వైయస్ జగన్పై కత్తితో దాడి: రక్తంతో తడిసిన షర్ట్, రోజా వార్నింగ్, కంటతడి
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులే తనకు రక్షణగా ఉన్నాయని జగన్ అన్నారు. ఇలాంటి దాడులు తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని, తాను రాష్ట్ర ప్రజల కోసం మరింత శ్రమిస్తానని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.