'అనంత'లో ఆరో రోజుకు జగన్ యాత్ర: ' ప్రజలను మోసగించడంలో చంద్రబాబు దిట్ట'
అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఆరో రోజుకు చేరింది. యాత్రంలో భాగంగా సోమవారం కొడిమిలో చేనేత కార్మికుడు రామాంజనేయులు, నరసనాయనకుంటలో రైతు లక్ష్మానాయక్ కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు.
మామిళ్లపల్లిలో జగన్కు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. రైతు భరోసా యాత్రకు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్ బాషా, రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, శంకర్ నారాయణలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మోసగించడంలో చంద్రబాబు ఆరితేరారు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ప్రజలను మోసగించడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆరితేరారని వైసీపీ శాసన మండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. సోమవారం చింతలపూడిలో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల పేరుతో రూ.1800 కోట్లు బూడిదలో పోసిన పన్నీరైందన్నారు.
గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయిన ఘటనపై విచారణ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ కార్యలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడుతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరైయ్యారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
RDT: ఫలించిన మంత్రి లోకేష్ మంత్రాంగం-మళ్లీ మొదలైన ఆర్డీటీ సేవా ప్రస్థానం..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications