రైతు భరోసాయాత్ర: గుంతకల్లులో పర్యటించిన జగన్ (ఫోటోలు)
హైదరాబాద్: రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం వైయస్ జగన్ గుంతకల్లు నియోజక వర్గంలో పర్యటించారు. గుంతకల్లుకు చేరుకున్న జగన్ వైటీ చెరువులో సుధాకర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ రోజు జగన్ రైతు భరోసా యాత్రను గుత్తి నుంచి ప్రారంభమైంది. లక్తానుపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు. రైతులు ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని అన్నారు.
అనంతరం గుంతకల్లు మండలంలోని గుండాల గ్రామంలో బండారి నెట్టెప్ప కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. రైతులకు అండగా ఉంటామని, వారిలో స్థైర్యం నింపేందుకు వైఎస్ జగన్ ఈ చేపట్టిన రైతు భరోసా యాత్ర చేపట్టిని సంగతి తెలిసిందే.

రైతు భరోసా యాత్రలో వైయస్ జగన్
గుంతకల్లు నియోజక వర్గంలోని లక్తానుపల్లెలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైయస్ జగన్. అన్నివిధాలా అండగా ఉంటానని వారికి భరోసాయిచ్చారు.

రైతు భరోసా యాత్రలో వైయస్ జగన్
రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం వైయస్ జగన్ గుంతకల్లు నియోజక వర్గంలో పర్యటించారు. ఈ రోజు జగన్ రైతు భరోసా యాత్రను గుత్తి నుంచి ప్రారంభమైంది.

రైతు భరోసా యాత్రలో వైయస్ జగన్
రైతు భరోసా యాత్రలో భాగంగా బుధవారం వైయస్ జగన్ గుంతకల్లు నియోజక వర్గంలో పర్యటించారు. గుత్తిలోని ఆర్టీసీ కార్మికులు తన గోడుని వైయస్ జగన్తో వెళ్లబోసుకుంటున్న దృశ్యం.

రైతు భరోసా యాత్రలో వైయస్ జగన్
గుంతకల్లుకు చేరుకున్న జగన్ వైటీ చెరువులో సుధాకర్ కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న వైయస్ జగన్. రైతులకు అండగా ఉంటామని, వారిలో స్థైర్యం నింపేందుకు వైఎస్ జగన్ ఈ చేపట్టిన రైతు భరోసా యాత్ర చేపట్టిని సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications