శిలువ గుర్తుతోజగన్ పుష్కర స్నానం: ఆరెస్సెస్, బిజెపికు ప్రచార సాధనం!
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు రాజమండ్రిలో పుష్కర స్నానం ఆచరించారు. అయితే, ఆయన తన మెడలో క్రాస్ గుర్తుతో (శిలువ గుర్తు) పవిత్ర స్నానం చేయడంపై సామాజిక అనుసంధాన వేదికల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మెడలో క్రాస్ గుర్తుతో జగన్ పవిత్ర స్నానం ఆచరించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై కామెంట్లు వస్తున్నాయి.
కొందరు ముఖ్యులు కూడా దీనిపై కామెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. క్రాస్ గుర్తుతో స్నానం చేయడంపై రెండు రకాలుగా విమర్శలు వస్తున్నాయి. పుష్కర స్నానం హిందువులు పవిత్రంగా చేసేది.
దానితో పాటు, జగన్ క్రాస్ గుర్తుతో స్నానం చేయడం వల్ల.. క్రైస్తవులు హిందూ దేవుళ్లను నమ్ముతున్నట్లుగా కనిపిస్తుందని, ఇది ఆరెస్సెస్, బిజెపిలకు ప్రచార సాధనంగా ఉపయోగపడవచ్చుననే కామెంట్లు కూడా వస్తున్నాయి.

జగన్ కుటుంబం ఒకప్పుడు హిందువులు అని, ఆ కారణంగానే అతను పవిత్ర స్నానం చేశారని, కొందరు చెబుతుంటే, వైయస్ విజయమ్మ చేతిలో బైబిల్ ఉండటాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. మరికొందరు, ఇది జగన్కు సంబంధించిన అంశమని అంటున్నారు. అయితే, జగన్ రాజకీయ కోణంలోనే పవిత్ర స్నానం చేశారనే వారు లేకపోలేదు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications