ప్రజా సంకల్పయాత్ర: 2 వేల కి.మీ.చేరువలో జగన్, 40 అడుగుల పైలాన్
Recommended Video

అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం నాటికి ( మే 14) రెండు వేల కిలోమీటర్లు చేరుకోనుంది. రెండు వేల కిలోమీటర్ల మైలు రాయి చేరుకోనున్న సందర్భాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లాలోని వెంకటాపురంలో 40 అడుగుల పైలాన్ను ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ను జగన్ ఆవిష్కరించనున్నారు.
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు.
జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. మే 14వ తేదిన పశ్చిమగోదావరి జిల్లాలోని వెంకటాపురం సమీపానికి చేరుకోగానే జగన్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను చేరుకోనుంది.

పాదయాత్ర వెంకటాపురం చేరుకోగానే రెండు వేల కిలోమీటర్లకు చేరుకొన్న గుర్తుగా 40 అడుగుల పైలాన్ ను జగన్ ఆవిష్కరిస్తారు. మే 14వ తేదిన ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దతుగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మే 14, 15 తేదిల్లో రెండు రోజుల పాటు పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications