వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బడ్జెట్‌లో చంద్రబాబు మార్క్, జగన్ ఆస్తులు ప్రకటించేందుకు మరో పదేళ్లు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులను ప్రకటించాలంటే మరో పదేళ్లు పడుతుందని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులను ప్రకటించాలంటే మరో పదేళ్లు పడుతుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య గురువారం నాడు అన్నారు.

'చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్‌లో 'అమరావతి' సహా ఇవెక్కడ?''చంద్రబాబూ! రైతుల చెవుల్లో పూవులు, బడ్జెట్‌లో 'అమరావతి' సహా ఇవెక్కడ?'

కేంద్ర బడ్జెట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్క్ ఉందని వర్ల అన్నారు. జగన్ అక్రమాస్తులను కేంద్రం వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఆస్తులను ప్రకటించేందుకు జగన్‌కు అంత భయం ఎందుకో చెప్పాలన్నారు.

YS Jagan should reveal his assets: Varla

జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు: సూర్యనారాయణ

ప్రజల మేలు కోసం ప్రభుత్వం చేపట్టే పనులను విపక్ష నేత వైయస్ జగన్ అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు.

జిల్లాకు తాగు, సాగు నీరు అందించేందుకు హంద్రినీవా పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తుంటే ఈ నెల ఆరో తేదీన జగన్ ఉరవకొండలో సభ ఎందుకు పెడుతున్నారో చెప్పాలని నిలదీశారు. సొంత ప్రయోజనాల కోసం జగన్ రెచ్చగొట్టే మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇరవై శాతం పనులు చేసి, 80 శాతం బిల్లులు వసూలు చేసుకుని వదిలివేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పుడు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయిస్తున్నారన్నారు. జగన్ తన ఉనికిని కోల్పోయారని, ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు.

English summary
Telugudesam Party leader Varla Ramaiah on Thursday demanded that YS Jagan should reveal his assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X