నేనున్నా, ఆత్మహత్యలు వద్దు: జగన్(పిక్చర్స్)
కడప: కష్టాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఏదైనా బతికే సాధించాలని, తాము అండగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు. జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా ఆదివారం పులివెందుల నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు.
కరువు నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతు కుటుంబాలను, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.
లింగాల మండలం బోనాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు గంగాధర కుటుంబాన్ని తొలుత పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బోనాల గ్రామానికి చెందిన రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.

వైయస్ జగన్
కష్టాలకు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఏదైనా బతికే సాధించాలని, తాము అండగా ఉంటామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ధైర్యం చెప్పారు.

వైయస్ జగన్
జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా ఆదివారం పులివెందుల నియోజకవర్గంలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు.

వైయస్ జగన్
కరువు నేపథ్యంలో ప్రభుత్వం పట్టించుకోక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతు కుటుంబాలను, అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు.

వైయస్ జగన్
లింగాల మండలం బోనాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు గంగాధర కుటుంబాన్ని తొలుత పరామర్శించారు.

వైయస్ జగన్
కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బోనాల గ్రామానికి చెందిన రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.












Click it and Unblock the Notifications