మంచినీళ్లకు కూడా దిక్కులేదు: వరద ప్రాంతాలను పరిశీలించిన జగన్(పిక్చర్స్)
నెల్లూరు: వరద బాధితులకు మంచినీళ్లు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, బంగారుపేట, నాయుడుపేటల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.
మంగళవారం ఉదయం 9.15 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరదబాధిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ బాధితులను పరామర్శించారు. అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసా కల్పించారు. ఆయన వెంకటగిరి పట్టణం పాతకోట వీధి, పోలేరమ్మ ఆలయం మీదుగా రాజావీధి, కైవల్యానది కూడలి, తహశీల్దార్ కార్యాలయం, తూర్పువీధి, పాతబస్టాండ్, పాలకేంద్రం మీదుగా బంగారుపేట బీసీ కాలనీ, బంగారుపేటలో పర్యటించారు.

బాధితులకు పరామర్శ
వరద బాధితులకు మంచినీళ్లు కూడా అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.

బాధితులకు పరామర్శ
జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళవారం నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, బంగారుపేట, నాయుడుపేటల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

బాధితులకు పరామర్శ
మంగళవారం ఉదయం 9.15 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వరదబాధిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ బాధితులను పరామర్శించారు. అందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతానని భరోసా కల్పించారు.

బాధితులకు పరామర్శ
ఆయన వెంకటగిరి పట్టణం పాతకోట వీధి, పోలేరమ్మ ఆలయం మీదుగా రాజావీధి, కైవల్యానది కూడలి, తహశీల్దార్ కార్యాలయం, తూర్పువీధి, పాతబస్టాండ్, పాలకేంద్రం మీదుగా బంగారుపేట బీసీ కాలనీ, బంగారుపేటలో పర్యటించారు.

బాధితులకు పరామర్శ
బీసీకాలనీలో భారీగా ప్రవహిస్తున్న వరదనీటిలోనే రెండు గంటలపాటు కలియతిరిగారు. ఇళ్లిల్లూ తిరిగి నీటమునిగిన చేనేత మగ్గాలను పరిశీలిస్తూ, కార్మికులను పలకరించారు.

ఇళ్లల్లో చేరిన నీరు
వెంకటగిరి నుంచి సాయంత్రం 4.20కి నాయుడుపేటకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిపొడవునా బాధితులు తాముపడుతున్న బాధలను విన్నవించారు.

బాధితులకు పరామర్శ
బీడీ కాలనీలో మోకాలు లోతు బురదలో పర్యటించి బీడీ కార్మికులను పరామర్శించారు.

బాధితులకు పరామర్శ
మల్లిక అనే మహిళ భర్త షేక్జమీల్ చలిగాలులకు మరణించటంతో ఆమెకు సహాయంగా నాయుడుపేట మున్సిపల్ ఫ్లోర్లీడర్ షేక్ రఫీతో రూ.10 వేల చెక్కును ఇప్పించారు.

బాధితులకు పరామర్శ
అనంతరం కొత్తబీడీ కాలనీ, లక్ష్మీఅనంతసాగరం, గోమతి, కోళ్లఫారం సెంటర్లలో పలువురు బాధితులను పరామర్శించారు. మీకు అండగా తాను పోరాడతానని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అనంతరం వాకాడు మండలం గొల్లపల్లికి చేరుకున్నారు.

బాధితులకు పరామర్శ
కాగా, బుధవారం కూడా వైయస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

బాధితులకు పరామర్శ
బుధవారం ఉదయం వాకాడు పంచాయతీ పరధిలోని గొల్లపాళెం నుంచి కోట మీదగా చిట్టమూరు మండలం మోమిడి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ నుంచి నేరుగా మనుబోలు మండలం కొలనుకుదురులో బాధితులను పరామర్శిస్తారు.
బీసీకాలనీలో భారీగా ప్రవహిస్తున్న వరదనీటిలోనే రెండు గంటలపాటు కలియతిరిగారు. ఇళ్లిల్లూ తిరిగి నీటమునిగిన చేనేత మగ్గాలను పరిశీలిస్తూ, కార్మికులను పలకరించారు. వెంకటగిరి నుంచి సాయంత్రం 4.20కి నాయుడుపేటకు బయలుదేరిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారిపొడవునా బాధితులు తాముపడుతున్న బాధలను విన్నవించారు. బీడీ కాలనీలో మోకాలు లోతు బురదలో పర్యటించి బీడీ కార్మికులను పరామర్శించారు.
కాగా, బుధవారం కూడా వైయస్ జగన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం వాకాడు పంచాయతీ పరధిలోని గొల్లపాళెం నుంచి కోట మీదగా చిట్టమూరు మండలం మోమిడి గ్రామంలో పర్యటించనున్నారు. అక్కడ నుంచి నేరుగా మనుబోలు మండలం కొలనుకుదురులో బాధితులను పరామర్శిస్తారు.












Click it and Unblock the Notifications