వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫీల్డ్‌లో టేబుల్‌లా వంగిన గార్డ్: జగన్‌టూర్‌పై కాంట్రోవర్సీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పర్యటనకు వెళ్లినప్పుడు అంగరక్షకుడిని టేబుల్‌లా వినియోగించుకున్నారని, దీనిపై విమర్శలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.

నెల రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు తుఫానులు అల్లకల్లోలం చేసిన విషయం తెలిసిందే. జగన్ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నవంబర్ నెలాఖరులో రెండు రోజుల పాటు హెలెన్ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

YS Jagan West Godavari tour turns controversial

ఈ నేపథ్యంలో ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటిస్తున్నప్పుడు ఓ పొలంలోకి వెళ్లి అంగరక్షకుడిని ఆసరాగా పెట్టుకొని మైకులో మాట్లాడారు. వరి పొలంలోకి వెళ్లిన జగన్ రైతులను ఉద్దేశించి మైకులో మాట్లాడారు.

జగన్ మాట్లాడుతున్నంత సేపు అతను ఆసరాగా ఉన్నారు. దీంతో అంగరక్షకుడి పైన మైకు పెట్టి మాట్లాడటమేమిటని జగన్ పైన విమర్శలు వినిపిస్తున్నాయని, ఇది జిల్లాలోను చర్చనీయాంశమైందంటున్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's West Godavari district tour turned controversial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X