షర్మిల పంచ్ల మీద పంచ్లు
వందే మాతరం గీతం 150 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రసంగం పట్ల ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. ఆ ప్రసంగంలో దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూపై మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది- స్వాతంత్ర్య ఉద్యమాన్ని అవమానించినట్టేనని అన్నారు.
జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి అసలైన విశ్వాస పాత్రుడు కాగా, సిసలైన విశ్వాస ఘాతకుడు మోదీనేనని వైఎస్ షర్మిల విమర్శించారు. దేశ మొదటి ప్రధానిపై మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవని, ఇది స్వాతంత్ర్య ఉద్యమాన్ని, సమర యోధులను, దేశ చరిత్రను తీవ్రంగా అవమానించినట్లేనని అన్నారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ వ్యాఖ్యలు దెబ్బకొడుతున్నట్లేనని పేర్కొన్నారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ సాక్షిగా ఆయన మత విధ్వేషాలను రెచ్చగొట్టినట్లేనని ఆరోపించారు.

దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని రావడానికి జవహర్ లాల్ నెహ్రూ 12 సంవత్సరాల పాటు జైలు శిక్షను భరించారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు. నెహ్రూ మీద, ఆయన పోరాటం వల్ల సిద్ధించిన స్వతంత్ర భారత దేశంలో 12 సంవత్సరాలుగా ప్రధాని పదవిలో ఉంటూ రాజభోగం అనుభవిస్తున్న మోదీ మాట్లాడడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. మోదీ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించడంతో సమానంగా అభివర్ణించారు షర్మిల.
బ్రిటీష్ పాలన అంతానికి జరిగిన స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ పూర్వీకులు ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మత ఛాందసవాదులు ఏనాడైనా వందేమాతర గీతాన్ని ఉచ్ఛరించారా, కనీసం ఎప్పుడైనా జాతీయ పతాకానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సెల్యూట్ కొట్టిందా? 2002 వరకు నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై మూడు రంగుల జెండా ఎగిరిందా? అని వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
బెంగాల్ ఎన్నికల కోసం ప్రజల మధ్య మరోసారి విభజన తీసుకుని రావడానికి, విచ్ఛిన్నకర శక్తులను ఉసిగొల్పడానికి జాతీయ గీతాన్ని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. స్వాతంత్ర్యోద్యమ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తున్నారని, వ్యవస్థల మీద బీజేపీ అజమాయిషీ చర్చ రాకుండా నెహ్రూను దోషిగా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. విభజించు - పాలించు సిద్ధాంతాలను మళ్లీ ఆచరిస్తున్న మోదీ మరో అభినవ బ్రిటీషర్ అని, జాతీయగీతాన్ని, వందేమాతర స్ఫూర్తిని ఈ దేశంలో నిలబెట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications