హైదరాబాద్ రాజధాని కొనసాగింపుపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి రాజధానుల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. ఎన్నికల వేళ రాజధాని లేని రాష్ట్రం పేరుతో విపక్షాలు టార్గెట్ చేస్తుంటే వైసీపీ దీనికి విరుగుడుగా విశాఖ రాజధాని కట్టుకునే వరకూ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతోంది. ఇదే ఇప్పుడు విపక్షాలకు మరో అస్త్రంగా మారిపోతోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు.
మరో రెండేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అడుగుతున్నారంటే ఇన్నాళ్లూ గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా అంటూ వైఎస్ షర్మిల ఇవాళ విరుచుకుపడ్డారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా అని అన్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారమిస్తే విభజన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, రాజధాని లేదని, ప్రత్యేక హోదా రాలేదని షర్మిల ఆక్షేపించారు. ప్రత్యేక ప్యాకేజీలు లేవని, పోలవరం పూర్తి కాలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు దిక్కులేదని షర్మిల విమర్శించారు. కొత్త పరిశ్రమలు లేవని, ఉన్నవి ఉంటాయో లేదో తెలియదని షర్మిల వ్యాఖ్యానించారు. 8 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పులాంధ్రప్రదేశ్ చేశారే తప్పా...అభివృద్ధి చూపలేదని ఆరోపించారు. మోడీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదన్నారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఉందన్నారు.
ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే...
— YS Sharmila (@realyssharmila) February 15, 2024
ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా ? 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలే.రాష్ట్రానికి రాజధాని లేదు.ప్రత్యేక హోదా రాలేదు.ప్రత్యేక ప్యాకేజీలు…
చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది త్రీడీ గ్రాఫిక్స్ అయితే... మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అన్నారు. పూటకో మాట,రోజుకో వేషం వేసే వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశమన్నారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్ప.. వైసీపీ కి రాజధానిపై,రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ది లేదని షర్మిల పేర్కొన్నారు.
-
Jeevan Reddy: జీవన్ రెడ్డి రాజీనామాకు ముహుర్తం ఫిక్స్-కార్యకర్తలకు లేఖ-ఏ పార్టీలోకి ? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications