జగన్ ను వదలని షర్మిల - సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అటు కూటమి నేతలు, ఇటు షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల సోదరి సునీత తో కలిసి వివేకా హత్య కేసులో వైసీపీ అభ్యర్ది అవినాశ్ ను టార్గెట్ చేసారు. అవినాశ్ కు జగన్ మద్దతు ఉందని ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న షర్మిల మరోసారి ముఖ్యమంత్రి జగన్ పైన సంచలన ఆరోపణలు చేసారు.
జగన్ మోసం
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం జగన్ ఏపీ ప్రజలను మోసం చేశారని పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం
కార్వేటినగరంలో పర్యటించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి మద్యం వ్యాపారంలో బాగా సంపాదించారని విమర్శించారు. నాసిరకం మద్యం విక్రయించడం ద్వారా పేద ప్రజల జీవితాలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. జగన్ ప్రభుత్వం ఒక చేత్తో మట్టిం చెంబు ఇష్తూ.. మరో చేత్తో వెండి చెంబు లాగేసుకుంటుందని విమర్శించారు.

మోసం చేసారు
వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేసిందని షర్మిల ఆరోపించారు. మెగా డీఎస్సీ ఇస్తామని నిరుద్యోగులను నిలువునా మోసం చేశారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతు రాజుగా ఉంటే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అన్నదాతను బికారిగా మార్చిందన్నారు. జగన్ పాలనలో రైతు ఆత్మహత్యలు అధికమయ్యాయన్నారు. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే.. జగన్ మోదీకి తొత్తుగా మారారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మెసం చేసిందన్నారు.

జగన్ విఫలమయ్యారు
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన జగన్.. ఐదేళ్ల కాలంలో ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని షర్మిల పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయిల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications