వివేకా హత్యకేసు..సాక్ష్యాలు తారుమారు వ్యవహారంలో గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్
వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది . ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైనా ఇప్పటి వరకు ఎవరు ఎందుకు ఆయన్ను హత్య చేశారు అనేది మాత్రం తెలియలేదు . తన ఇంట్లో వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపిన కేసులో గత ప్రభుత్వం వై ఎస్ వివేకా హత్యకేసు విచారణకు సిట్ ను నియమించినా అది కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు .దీంతో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సిట్ ను నియమించి వై ఎస్ వివేకా హత్యకేసును ఛేదించే పనిలో పడింది . ఇక అందులో భాగంగా వివేకా ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలకు కోర్టు అనుమతించింది .
వాచ్ మ్యాన్ రంగయ్య, శేఖర్ రెడ్డిలకు పూర్తైన నార్కో పరీక్షలు .. గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలకు కోర్టు అనుమతి
వివేకా హత్యకేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక ఈ దర్యాప్తులో వాచ్ మ్యాన్ రంగయ్య ను విచారించిన సిట్ అధికారులు రంగయ్య నుండి సరైన సమాధానం రాబట్టలేక కోర్టు అనుమతితో రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయించటానికి హైదరాబాద్ తరలించారు. ఇక వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పాత్రధారి అని భావిస్తున్న కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డిని కూడా నార్కోఅనాలసిస్ పరీక్షలకు తరలించారు .

ఇక తాజాగా ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు వివేకానంద రెడ్డి ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి నార్కోఅనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . ఈ పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది . వాచ్మెన్ రంగన్న, కిరాయి హంతకుడు శేఖర్రెడ్డిలకు నార్కోఅనాలసిస్ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతించిన కోర్టు గంగిరెడ్డి విషయంలో కూడా నార్కో పరీక్షలకు అనుమతించింది.
సాక్ష్యాలను తారుమారు ఆరోపణలపై ఎర్ర గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలు చెయ్యనున్న సిట్
వైయస్ఆర్సిపి నాయకుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి సంచలన హత్య కేసులో, హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలపై ఎర్ర గంగి రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షను కోర్టు అనుమతించటంతో ఆయన్ను హైదరాబాద్ తరలించనున్నారు . జైలు నుంచి బెయిల్పై ఉన్న గంగిరెడ్డికి కోర్టు నార్కో పరీక్షలను చెయ్యాలనే పోలీసుల అప్పీల్ అంగీకరించింది . ఇక వివేకా ఇంటి కాపలాదారు రంగయ్య, శేఖర్ రెడ్డిలకు ఇప్పటికే నార్కో అనాలిసిస్ పరీక్ష జరిగినట్టు తెలుస్తుంది . ఇంతకు ముందు, నార్కో పరీక్ష నిర్వహించాలన్న సిట్ అభ్యర్థనను పులివెందుల కోర్టు తిరస్కరించింది. అయితే, ఇటీవల, అదే కోర్టు నిందితులకు పరీక్షను అనుమతించింది. వైయస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు పోలీసులు మార్చి 28 న వారిని అరెస్టు చేశారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications