మా ఇంట్లోనే మాకు శత్రువులు: వైఎస్ వివేకా సతీమణి సంచలన వీడియో; టీడీపీ ట్వీట్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రస్తుతం వైయస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి వేళ అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. వివేకానంద రెడ్డి హత్య కేసును తెరమీదకు తీసుకువచ్చి రాజకీయాలు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఆయుధంగా ఎంచుకున్నాయి.
గత ఎన్నికలకు ముందు మార్చి నెలలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు వైయస్ వివేకానంద రెడ్డి ని ఎవరు ఎందుకు హతమార్చారు అన్నది బయటకు రాలేదు. అయితే నేడు మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్ వద్ద ఆయన కుమార్తె సునీత రెడ్డి తండ్రి సమాధి వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు.

ఇదే సమయంలో వైయస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ మాట్లాడిన ఒక సంచలన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇటీవల ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌభాగ్యమ్మ తన భర్త మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు. మా ఇంట్లోనే శత్రువులు ఉన్నారని, ఈ విషయం తాము గ్రహించలేకపోయామని సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకానంద రెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించి ఆయనను పక్కన పెట్టేసారు అని వ్యాఖ్యలు చేశారు. అసలు వైయస్ వివేకానంద రెడ్డి విషయంలో ఇలా జరుగుతుందని కానీ, ఇలా చేస్తారని కానీ తమ ఊహించలేకపోయాము అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెవరి మనసులో ఏముందో గ్రహించలేకపోయామని పేర్కొన్న సౌభాగ్యమ్మ, తలుచుకుంటే చాలా బాధేస్తుంది అని పేర్కొన్నారు.
జగన్లో మాపై ఇంత ద్వేషం ఉందనుకోలేదు. మా ఇంట్లోనే మా శత్రువులు ఉన్నారని గ్రహించలేక పోయాం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి.
— Telugu Desam Party (@JaiTDP) March 15, 2024
- వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ#JaganBehindVivekaMurder #AbbaiKilledBabai #JusticeForBabai #YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/aDIXrrM5g2
ఆమె మాట్లాడిన వీడియోను టిడిపి తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది. సౌభాగ్యమ్మ వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించిన వ్యాఖ్యలని పోస్ట్ పెట్టింది. జగన్లో మాపై ఇంత ద్వేషం ఉందనుకోలేదు. మా ఇంట్లోనే మా శత్రువులు ఉన్నారని గ్రహించలేక పోయాం. ఇది చాలా ఘోరమైన పరిస్థితి అని వైయస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ వ్యాఖ్యలు చేశారని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications