పాదయాత్ర తర్వాత అనూహ్య నిర్ణయం, బాబుకు జగన్ షాక్: ఒక్క దెబ్బకు పవన్ కళ్యాణ్ కూడా
Recommended Video
అమరావతి: 2019 ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక హోదాపై అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. హోదా కోసం టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో వైసీపీ దీక్ష చేస్తే, టీడీపీ ప్రధాని నివాసం వద్ద ఆందోళన నిర్వహించింది.
బంద్ మా పార్టీ విధానం కాదు కానీ: పవన్ కళ్యాణ్ ప్రకటన, 'త్వరలో సినీ-టీవీ ఆర్టిస్ట్ల దీక్ష!'
రాష్ట్రంలోను బంద్ ఆంటూ దీక్షలు అంటూ పోటీ పడుతున్నాయి. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు సహా టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేయనున్నారు. మరోవైపు జగన్ హోదా అంశంపై వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎంపీలతో రాజీనామా చేయించారు. త్వరలో ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు.
ఎమ్మెల్యేల రాజీనామా.. చంద్రబాబుకు జగన్ గట్టి షాక్
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న జగన్ త్వరలో చంద్రబాబుకు గట్టి షాకివ్వనున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీని కార్నర్ చేసేందుకు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సామూహిక రాజీనామాలు చేయించనున్నారని అంటున్నారు. ఇప్పటికే ఎంపీలు రాజీనామా చేశారు. ఇక వరుసలో ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్నారు.
పాదయాత్ర ముగియగానే అనూహ్య నిర్ణయం
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం జగన్ పాదయాత్ర మే 10న ముగియనుంది. పాదయాత్ర మరో ఇరవై రోజులు పొడిగించే అవకాశాలు ఉండొచ్చునని చెబుతున్నారు. ఈ పాదయాత్ర అనంతరం జగన్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.
అలా మరింత హోదా వేడి
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2019లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019 మధ్య ఎన్నికల కమిషన్ ఎప్పుడైనా ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. దీని కంటే ముందే తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి జగన్ రాష్ట్రంలో మరింత హోదా వేడిని రాజేయాలని చూస్తున్నారని అంటున్నారు.
త్వరలో జగన్ నిర్ణయం
ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు తాము సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. అందుకే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు. పార్టీ ఎమ్మెల్యేల సామూహిక రాజీనామా నిర్ణయంపై జగన్ త్వరలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
ఎలాగు సభకు హాజరుకావడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో సామూహిక రాజీనామాలు చేయడం ద్వారా చంద్రబాబును పూర్తిగా కార్నర్ చేయాలని, అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంలో టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన కంటే తామే ముందున్నామని, హోదా ఛాంపియన్ తామే అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.
ఎంపీల రాజీనామాపై టీడీపీ, ఉప ఎన్నికలు రాకపోవచ్చు
ఇప్పటికే వైసీపీ ఎంపీల రాజీనామా నిర్ణయాన్ని టీడీపీ తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకోకపోవచ్చునని, రాజీనామాలతోను ఇరుకున పెట్టవచ్చునని జగన్ భావిస్తున్నారట. రాజీనామాలు ఆమోదిస్తే అది వైసీపీకి మరింత ప్లస్ అవుతుందని అంటున్నారు. కానీ రాజీనామాలు ఆమోదించరని, అప్పుడు ఉప ఎన్నికలు వచ్చే ఆస్కారం లేదంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు జూన్ నెలలో రాజీనామా చేయవచ్చు. దీంతో హోదా వేడి రాజుకుంటుంది. అంతేకాదు, ఎన్నికలకు ఏడాది ముందు ఈసీ కూడా ఉప ఎన్నికలు నిర్వహించదు.