YSRCP సంచలన నిర్ణయం, ఇక జాతీయ స్థాయిలో..!!
ఏపీలో రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. తిరుమల లడ్డూ వ్యవహారం రాజకీయంగా చోటు చేసుకున్న డైలాగ్ వార్ నడుమ.. రెండో రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠను పెంచుతున్నాయి. జోగి రమేశ్ ఇంటి పైన దాడి పైన వైసీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. జోగి రమేశ్ నివాసాన్ని పరిశీలించారు. వరుస ఘటనల పైన జగన్ ఆరా తీసారు. పార్టీ ముఖ్య నేతలతో భేటీ ఏర్పాటు చేసారు. ఇక.. ఈ వరుస ఘటనల పైన జాతీయ స్థాయిలో నిరసనలకు వైసీపీ సమాయత్తం అవుతోంది.
ఏపీలో తాజా ఘటనల పైన వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజులుగా చోటు చేసుకుంటు న్న పరిణామాల పైన మాజీ సీఎం జగన్ పార్టీ నేతలతో చర్చించారు. ముందుగా క్రిష్ణా, గుంటూరు జిల్లా నేతలు ఈ ఘటనల పైన చర్చించారు. జగన్ కు పూర్తి సమాచారం ఇచ్చారు. రేపు ఈ రెండు జిల్లాల నేతలతో జగన్ సమావేశం కానున్నారు. కీలక ప్రకటన చేసేందుకు సిద్దమయ్యారు. కాగా, ఈ పరిణామాల పైన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై జాతీయ స్థాయి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్సా సత్యనారాయణ వెల్లడించారు. జాతీయ ఉద్యమం కోసం వైఎస్ జగన్తో మాట్లాడి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను చేతుల్లోకి తీసుకుని వైసీపీ నాయకులపై మూడు రోజులుగా దుర్మార్గానికి పాల్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అంబటి ఇళ్లు దహనం, జోగి రమేష్ ఇంటిపై పెట్రోలు బాంబులు వేయడం దౌర్జన్య పాలనకు పరాకాష్ట అని విమర్శించారు.

కీలక నిర్దయం దిశగా జగన్
కాగా, ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే అందుకు బాధ్యులెవరంటూ ప్రశ్నించారు. రాష్ట్రం మరో బిహార్ మాదిరిగా తయారవుతుందని ఆరోపించారు. శాంతి భద్రతల పర్యవేక్షించాల్సిన రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు ప్రోత్సహించి చంద్రబాబు అప్రతిష్ట మూటకట్టు కోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో ఏదో ఒక సమస్య వస్తే దానిని డైవర్ట్ చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడేవిధంగా అనేక రకాలు కుట్రలు చేస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో హింసకాండ జరిగితే బీజేపీ, జనసేన ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదని అన్నారు. కేంద్ర మంత్రి పౌరుషంగా మాట్లాడడంపై అభ్యంతరం సంపద సృష్టిస్తామని చెప్పి విశాఖలో ఉన్న రూ.5 వేల కోట్ల విలువైన భూములను కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి తాటాకు చప్పుళ్లకు వైసీపీ బెదరదని బొత్సా పేర్కొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications