వైసీపీకి పవన్ షాక్: ముఖాముఖి పోటీకే వైసీపీ వ్యూహత్మక అడుగులు
2019 ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుండి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖాముఖి పోటీ ఉంటేనే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ భావిస్తోంది,.
అమరావతి: 2019 ఎన్నికల కోసం వైసీపీ ఇప్పటి నుండి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖాముఖి పోటీ ఉంటేనే రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని ఆ పార్టీ భావిస్తోంది,. ఈ మేరకు వైసీపీ నాయకత్వం మైండ్గేమ్ ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Recommended Video

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ నవంబర్ 6వ, తేది నుండి పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు ఇతర పార్టీలు ఏపీ రాష్ట్రంలో బలపడితే రాజకీయంగా తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.
ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు అవసరమైన అన్ని అవకాశాలను ఆ పార్టీ అన్వేషిస్తోంది. ఈ తరుణంలో ఇతర పార్టీలకు చెందిన నేతలంతా తమ పార్టీలో చేరుతున్నారని వైసీపీ నేతలు మైండ్గేమ్ ఆడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ముఖాముఖి పోటీని కొరుకొంటున్న వైసీపీ
2019 ఎన్నికల్లో టిడిపి, తనకు మధ్యే ముఖాముఖి పోటీ ఉండాలని వైసీపీ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడేలా ఎత్తులు వేస్తోంది. టీడీపీతో ముఖాముఖి తలపడితేనే 2019 ఎన్నికల్లో ప్రయోజనమని అనుకుంటోంది. కాంగ్రె్సలో వ్యక్తిగత ప్రతిష్ఠ, ప్రజాకర్షణ కలిగిన నేతలను తన గూటికి రప్పించుకునే విధంగా వైసీపీ మైండ్గేమ్ ఆడుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకు వైసీపీ ప్లాన్
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకుగాను వైసీపీ వ్యూహత్మకంగా ప్లాన్ చేస్తోంది. టిడిపికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయపార్టీల్లో ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది వైసీపీ. వచ్చే ఎన్నికల్లో పవన్కళ్యాణ్ కూడ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే రాజకీయంగా తమకు నష్టమనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లో ఉంది. ఈ కారణంగా టిడిపికి వ్యతిరేకంగా ఉన్న నేతలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

జనసేనతో వైసీపీకి ఇబ్బందేనా?
2019 ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. పవన్ పార్టీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలకు పోటీ చేస్తారు.. ఏయే స్థానాలకు పోటీ చేస్తోరు.. ఎవరితో జత కడతారు.. ఒంటరిగానే పోటీ చేస్తారా, వామపక్షాలతో కలిసి పోటీచేస్తారా, పవన్ పోటీచేస్తే ఏపీలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలపై వైసీపీ నేతలు అంతర్గత సమావేశాల్లో చర్చిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రె్సకు అనుకొన్న మేర ఓట్లు
రాలేదు. అయితే 2019లో శాసనసభలో అడుగుపెడతామని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ధీమాతో ఉంది. అయితే ఈ మేరకు ఇటీవల కాలంలో ప్రత్యేక హోదా పేరుతో ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిర్వహించింది. కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తున్న ఈ ధీమా యే వైసీపీని కలవరపెడుతోంది. అసెంబ్లీలో అడుగుపెట్టేంత బలం కాంగ్రె్సకు వస్తే అది తమకే ముప్పని అర్థమైంది. పైగా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉంటే వారికీ కొన్ని ఓట్లు పడతాయని.. వారంటూ పోటీలోనే లేకపోతే ఆ ఓట్లన్నీ తమకే పడతాయని వైసీపీ నేతలు అంటున్నారు. దరిమిలా కాంగ్రె్సలో సొంత బలం, వ్యక్తిగత ప్రతిష్ఠ కలిగిన నేతలపై వారు కన్నేశారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications