సీమ కేంద్రంగా వైసీపీ భారీ స్కెచ్, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు ఫిక్స్ చేస్తున్నాయి. ఇందుకు కౌంటర్ గా మాజీ సీఎం జగన్ కొత్త ప్రణాళికలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ కేంద్రంగా భారీ స్కెచ్ సిద్దం చేస్తున్నారు. అమలు ముహూర్తం ఖరారు చేసారు. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని మరో కార్యక్రమానికి సిద్దమైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేలా కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఫిబ్రవరి 5వ తేదీన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ధర్నా, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు.

రాయలసీమ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని పేర్కొన్నారు. సీమ ప్రజల సాగు, త్రాగునీటి అవస రాల కోసం శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వెనుక నుండి నీటిని తరలించే ఏర్పాట్లు చేశారని మాజీ ఆర్దిక మంత్రి బుగ్గన వెల్లడించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమకు నీరు అందుతుండ గా, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాంతానికి ప్రాజెక్టులు నిర్మించుకుంటోందని చెప్పారు. సీమకు తరలిస్తున్న నీటిని అడ్డుకునేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఒప్పందంపై ఏపీ మంత్రులు ఒక్కరూ ప్రశ్నించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు.
నిరసనలు.. బహిరంగ సభ
ఇక, గ్రేటర్ రాయలసీమ కోసం ఎత్తిపోతల పథకం సాధించేవరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుంద ని స్పష్టం చేశారు. ఈ పథకాన్ని నిలిపివేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడంలో విఫలమవుతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బుగ్గన విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా ఆరోపణలు చేశారని, అయితే సీబీఐ విచారణలో అలాంటిది ఏమీ లేదని తేలిందని గుర్తు చేశారు. ఈ తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా తప్పుబట్టారు. ఫిబ్రవరి 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద జరిగే ఈ నిరసన కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, గ్రేటర్ రాయలసీమ వాసులంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బుగ్గన కోరారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications