జగన్పై దూషణ ఎఫెక్ట్: జేసీ ప్రభాకర్పై కేసు నమోదు చేయాలని ధర్నా
తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ అనంతపురంలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట వైసిపి నేతలు ఆందోళనకు దిగారు.
అనంతపురం: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ అనంతపురంలోని జేసీ ట్రావెల్స్ కార్యాలయం ఎదుట వైసిపి నేతలు ఆందోళనకు దిగారు.
ప్రతిపక్ష నేతను దూషించినందుకు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలంటూ బైఠాయించి నిరసన చేపట్టారు. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమించాలంటూ విజ్ఞప్తి చేశారు. అయితే జేసీపై కేసు నమోదు చేసేవరకు ఆందోళన విరమించబోమని చెప్పడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు.
సీఎం నాకు ఏ సాయం చేశారో చెప్పాలి: జేసీ
ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు ఏం సాయం చేశారో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదివారం నాడు మరోసారి ప్రశ్నించారు. అభాండాలు వేసి సీఎంను రచ్చకు ఈడ్చవద్దన్నారు. తమ దివాకర్ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాద సంఘనటపై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications