వైసీపీ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఆస్తుల వేలం !
వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీకి అనుబంధ విభాగమైన ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ నుంచి రేణుక, ఆమె భర్త నీలకంఠం రూ.310 కోట్లు అప్పు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసీ సిద్దమైంది. ఇప్పటికే రెండు సార్లు వేలం వేయగా.. ఇప్పుడు మూడోసారి కూడా వేలం వేయబోతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధి అయ్యి ఉండి ఈ తరహా ఘటనలో ఆమె పేరు వినిపిస్తుండడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
లోన్ వివరాలు..
2018లో 15 ఏళ్ల కాలానికి గాను.. మాజీ ఎంపీ రేణుక, ఆమె భర్త నీలకంఠం కలిసి రూ.310 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు వినియోగించారు. ఐదేళ్ల క్రితం వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు. మొత్తం రూ. 40 కోట్ల వరకు తిరిగి చెల్లించారు. అయితే, ఆ తర్వాతి నుంచి చెల్లింపులు నిలిపివేశారు. అసలు, వడ్డీ కలిపి ఇంకా దాదాపు రూ. 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే, వడ్డీ భారం ఎక్కువగా ఉండటంతో కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీ షెడ్యూల్ చేయాలని వారు కోరారు.

అయితే ఈ ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో హెచ్ఎఫ్ఎల్ దీనిని అంగీకరించలేదు. అంతే కాకుండా రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూపంలో రూ. 3.4 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం భారంగా మారడంతో తొలుత తక్కువ మొత్తం తీసుకుని.. చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని రేణుక ప్రతిపాదించారు. అందుకు కూడా హెచ్ఎఫ్ఎల్ ఆమోదం తెలుపలేదు. ఈ నేపథ్యంలో వాయిదాల చెల్లింపు నిలిచిపోవడంతో ఎన్సీఎల్టీని హెచ్ఎఫ్ఎల్ ఆశ్రయించింది.
గతంలో రెండుసార్లు వేలం..
ప్రస్తుతం ఈ కేసు పెండింగ్లో ఉండగా.. లోన్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని 5 వేల గజాల ఆస్తిని రూ.145 కోట్లకు వేలం వేశారు. కానీ ఎవరూ ముందుకు వచ్చి వేలంలో పాల్గొనలేదు. అలానే మాదాపూర్లోని 7,205 చదరపు గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ కూడా వేలం వేయగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో అధికారులు మరోమారు ఆస్తులను వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications