పవన్ కల్యాణ్ తో వైసీపీ ఎమ్మెల్యే సమావేశం - సీటు పై కీలక హామీ..!!
ఏపీలో ఎన్నికల వేళ నేతల పార్టీ మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వైసీపీ నుంచి కొందరు ముఖ్య నేతలు టీడీపీ, జనసేన లోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే వర ప్రసాద్ జనసేనాని పవన్ తో సమావేశమయ్యారు. గూడూరు నుంచి ఈ సారి ఎమ్మెల్సీ మేరిగ మురళీధరరావుకు జగన్ ఇంఛార్జ్ బాధ్యతలు కేటాయించారు. దీంతో, తాజాగా పవన్ ను కలిసిన వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో సీటు పైన చర్చించగా, హామీ దక్కినట్లు తెలుస్తోంది.
పవన్ తో వైసీపీ ఎమ్మెల్యే భేటీ : వైసీపీలో సీట్లు దక్కని నేతలు టీడీపీ, జనసేన నుంచి సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు తాజాగా జనసేనాని పవన్ తో సమావేశమయ్యారు. వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు. ఆ సమయంలోనే మెగా కుటుంబంతో సంబంధాలు ఏర్పడ్డాయి. తరువాత వైసీపీలో చేరిన వరప్రసాద్ 2014లో తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో వరప్రసాద్ కు సీఎం జగన్ సీటు నిరాకరించారు. అక్కడినుంచి పలువురు అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న పరిస్థితుల్లో వైసీపీ ఇన్చార్జిగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధరరావు పేరును పార్టీ ఖరారు చేసింది.

ఎంపీ సీటు కేటాయించాలని వినతి : దీంతో, పవన్ ను కలిసిన వరప్రసాద్ వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఉండటంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తిరుపతికి ప్రస్తుతం వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తమతో కలిసి వస్తే తిరుపతి బీజేపీకి కేటాయించాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచనగా తెలుస్తోంది. బీజేపీ కలిసి రాకపోతే జనసేనకు తిరుపతి పార్లమెంట్ సీటు కేటాయిస్తారనే వాదన ఉంది.

35 సీట్లకు పవన్ అభ్యర్దులు సిద్దం : ఈ క్రమంలో పవన్ ను కలిసిన వరప్రసాద్ తాను గతంలో తిరుపతి నుంచి గెలిచి ఉండటంతో, తనకు తిరుపతి సీటు కేటాయించాలని కోరినట్లుగా సమాచారం. అటు పవన్ కల్యాణ్ ఇప్పటికే 35 సీట్లకు సంబంధించి అభ్యర్దులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. పొత్తులో భాగంగా పవన్ 40 సీట్లు కోరుతున్నారు. కాగా, చంద్రబాబు నుంచి ఎన్ని సీట్లకు ఆమోదం లభిస్తుందనేది ఇప్పుడు కీలక అంశంగా మారుతోంది. గోదావరి జిల్లాల్లో జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తోందది. దీంతో, జనసేనకు కేటాయించే సీట్ల ఆధారంగా పవన్ తన పార్టీలో చేరిన వారికి సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా గోదావరి తో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ ఎక్కువ సీట్లు కోరుతున్నట్లు తెలుస్తోంది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications