'జేసీ జోకర్.. వైఎస్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన నువ్వా విమర్శించేది'
కడప: మహానాడు వేదికగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిలపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబంపై అవినీతి ఆరోపణలతో పాటు పరోక్షంగా హత్యా రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. తాత రాజారెడ్డి లాగే జగన్ లోనూ క్రూరత్వం ఉందని జేసీ విమర్శించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ జేసీకి కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఆ పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి దీనిపై స్పందించారు. వైఎస్ కుటుంబాన్ని విమర్శించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు జోకర్ లాంటి జేసీతో విమర్శల దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన జేసీ.. ఇప్పుడు ఆ మహా నేతనే విమర్శించడం సరికాదన్నారు.

ప్రజలు జేసీ తీరును ఇక సహించరని, ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీలను మహానాడులో ఎందుకు ప్రస్తావించ లేదని శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో జేసీకి ఓటమి తప్పదని అన్నారు. టీడీపీ, బీజేపీలు రెండూ మూకుమ్మడిగా రాష్ట్రాన్ని మోసం చేశాయని రాచమల్లు ఆరోపించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications