మా పార్టీ నేతల భార్యలు కలవలేదు: శోభా నాగిరెడ్డి

ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. చంద్రబాబు మళ్లీ పర్యటన చేస్తే సీమాంధ్ర ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే సత్తా లేకనే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. క్విడ్ ప్రోకో జరగలేదని మొదటి నుంచీ తాము చెబుతూనే ఉన్నామని, సిబిఐ కూడా ఇప్పుడు అదే తేల్చిందని ఆమె అన్నారు.
రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి, పాలన పూర్తిగా అస్తవ్యస్తం కావడానికి అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కారణమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు విమర్సించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రం అధోగతి పాలవుతోందని వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
సమైక్య ఉద్యమం వల్ల సామాన్యులు, ఉద్యోగులు, రైతులు రోడ్డున పడ్డప్పటికీ చంద్రబాబు, కిరణ్ మాత్రం తమ తమ పదవులను పట్టుకుని వేలాడుతున్నారని వారు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటన ఎందుకో చెప్పలేకపోవడం చంద్రబాబు లోపాయికారీ రాజకీయాలకు నిదర్శనమని వారన్నారు.
జగన్ బెయిల్ను అడ్డుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, అందుకే ఆ వాస్తవాన్ని చెప్పలేకపోతున్నారని వారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం రాజీనామాలు చేయవద్దని కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు తమ తమ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు చెబుతూ తప్పుదారి పట్టిస్తున్నారని వారన్నారు.












Click it and Unblock the Notifications