చంద్రబాబు టైంలో ఎయిడ్స్ లో ఫస్ట్-ఇప్పుడు అందులో ఫస్ట్- మంత్రి దాడిశెట్టి కామెంట్స్..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లో భాగంగా మాటలయుద్ధం తీవ్రమవుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రమంత్రి దాడిశెట్టి రాజా గత టీడీపీ ప్రభుత్వ పాలనను, ప్రస్తుత వైసీపీ పాలనతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తద్వారా జగన్ పాలన ఎంత మెరుగ్గా ఉందో చెప్పే ప్రయత్నం చేశారు.
గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రం హెచ్ఐవీ ఎయిడ్స్ లో ప్రధమ స్థానంలో ఉండేదని వైసీపీ మంత్రి దాడిశెట్టి రాజా గుర్తుచేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం జబ్బుపడిపోయిందన్నారు. జగనన్న నాయకత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయం రాష్ట్రంలో పరుగులు పెడుతుందన్నారు. సీఎం జగనన్న ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని రాజా వెల్లడించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
అర్హులను వెతికి వారికి పధకాలు అందించడమే జగనన్న సురక్ష లక్ష్యమని గుర్తుచేశారు.

ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు అందకుండా ఉండారా అన్నది తెలుసుకోవడమే జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. గత 40 ఏళ్లలో పాలించిన వారు ఎంతిచ్చారో, జగన్ పాలనలో ప్రజలకు ఎంత ఇచ్చారో సరిపోల్చి చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు గతంలో ఎలా ఉండేవో, ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా చూడాలన్నారు. జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యావ్యవస్ధ దేశంలోనే మొదటి స్ధానంలో ఉందన్నారు.

గతంలో ఎల్లో మీడియా విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఓ విషయంలో మొదటిస్ధానంలో ఉండేదన్నారు. అది హెచ్ఐవీ ఎయిడ్స్ అన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం జబ్బు పడిపోగా.. ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు పరుగుపెడుతుందన్నారు. గతంలో ఆస్పత్రులకూ, ఇప్పుడు ఆస్పత్రులకు కూడా తేడా గమనించాలని మంత్రి రాజా కోరారు. ప్రస్తుతం రోజుకు 25 -30 వేలు ప్రభుత్వ ఆస్పత్రులకు ఖర్చుపెడుతున్నామన్నారు. జనం ఈసారి 175 సీట్లు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?











Click it and Unblock the Notifications