అరచేతిలో వైకుంఠం, మరో నాలుగేళ్లు: రవీంద్రనాధ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ పాలనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనతో ప్రజలంతా విసిగిపోయారని అన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే ప్రజలకు చుక్కలు చూపెడుతోందని ధ్వజమెత్తారు.

ఈ ప్రభుత్వాన్ని మరో నాలుగేళ్ల పాటు ప్రజలు మోయాల్సిన పరిస్ధితి రావడం ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జగన్ చేపట్టనున్న 'సమరదీక్ష' పోస్టర్ను విడుదల చేసి సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు: మంత్రి ఉమా
ఏపీ రాజధానిలో జూన్ 2న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అదే రోజు ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు తెలిపారు. ఇక విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు కార్యాలయంగా జలవనరుల శాఖ బిల్డింగ్ని సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications