స్పీకర్ కోడెలను కలిసిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎందుకంటే...
ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరితోపాటు గతంలోనూ పార్టీ జంప్ చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు.
అమరావతి: ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైసీపీ ఎమ్మెల్యేలు కలిశారు. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు స్పీకర్ ను కోరారు.
రాజేశ్వరిని అనర్హురాలిగా ప్రకటించాలని, అలాగే గతంలో పార్టీ మారిన ఎమ్యెల్యేలపై ఇచ్చిన ఫిర్యాదులపై కూడా వెంటనే చర్యలు వైసీపీ ఎమ్మెల్యేలు కోరారు. వంతల రాజేశ్వరి ఈనెల 4వ తేదీన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కండువా వేసి రాజేశ్వరి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ సందర్భంగా చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధిని చూసే తాను టీడీపీలో చేరానని, తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానని రాజేశ్వరి పేర్కొన్నారు.
ఈ సందర్బంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, తమ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని ప్రభుత్వం నడిపిస్తున్నారని విమర్శించారు. దేశంలో విపక్ష ఎమ్మెల్యేలతో నడుస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని ఆయన ఎద్దేవా చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications