మరో వైసీపీ ఎంపీ రాజీనామా- రాజ్యసభ ఛైర్మన్ నోటిఫికేషన్.. !
వైసీపీ అధికారంలో ఉండగా రాజ్యసభ ఎంపీలుగా నామినేట్ అయిన వారంతా ఇప్పుడు వరుసగా తమ పదవులు వదులుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడుతున్న రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల్ని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. ఇవాళ మరో ఎంపీ రాజీనామాను ఆమోదిస్తూ ఛైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీటిని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడంతో ఈ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. నిన్న మరో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా తన పదవిని వదులుకున్నారు. ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన తన పదవిని వదులుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడంతో వైసీపీ నుంచి మూడో ఎంపీ రాజీనామా ఆమోదం పొందినట్లయింది. వైసీపీకి రాజ్యసభలో మొత్తం 11 మంది ఎంపీలు ఉండగా.. ఇందులో ముగ్గురు రాజీనామాలు చేశారు.
మరోవైపు వైసీపీకి ఇప్పటికే గుడ్ బై చెప్పడంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులు కూడా వదులుకున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇప్పటివరకూ ఏ పార్టీలో చేరలేదు. ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం ఇప్పటివరకూ దీనిపై నోరు విప్పలేదు. ప్రస్తుతానికి మోపిదేవి, బీద తరహాలోనే ఆయన కూడా మౌనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications