వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వ అవినీతిని అడ్డుకొంటే రాక్షసులమా?: వైవీ సుబ్బారెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రతి సంక్షేమ పథకంలో భారీ అవినీతి, దోపిడీ జరుగుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు వైవీ సుబ్బారెడ్డి.

అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రతి అవినీతిని అడ్డుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.. ప్రభుత్వం చేసే అవినీతిని అడ్డుకుంటే రాక్షసులమౌతామా అని ప్రశ్నించారు. దోపిడిని ఆపాలనే అడ్డుపడుతున్నామని ఆయన చెప్పారు.

Ysrcp mp Yv Subbareddy slams on Chandrababunaidu

ఉపాధి హామీ నిధుల్లో భారీ అవినీతి జరుగుతోందని, సాక్షాత్తు కేంద్రమే నిధుల దుర్వినియోగం గురించి చెప్పిందని ఆయన వివరించారు. ప్రభుత్వ అవినీతిని అడ్డుకుంటున్నందుకే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని విమర్శించారు

. ఉపాధి హామీ నిధుల అమలును కాగ్‌ రిపోర్టు తప్పు పట్టిందని వైవీ గుర్తుచేశారు. ఉపాధి హామీ పనులు, నిధుల్లో అవకతవకలు జరిగాయనడానికి తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.

పేదలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి నిధులను, పచ్చచొక్కాలకు మాత్రమే లబ్థి చేకూరేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వైవీ విమర్శించారు. పేదల కడుపు కొట్టే ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంటే అభివృద్ధి నిరోధకులు అంటూ వైఎస్సార్సీపీపై బురద చల్లుతారా అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

English summary
Ysrcp Mp Yv Subbareddy made allegations on Ap Cm Chandrababunaidu on Thursday. Yv Subbareddy condemned chandrababu naidu comments on Ysrcp .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X