ప్రభుత్వ అవినీతిని అడ్డుకొంటే రాక్షసులమా?: వైవీ సుబ్బారెడ్డి
హైదరాబాద్: ప్రతి సంక్షేమ పథకంలో భారీ అవినీతి, దోపిడీ జరుగుతోందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు వైవీ సుబ్బారెడ్డి.
అభివృద్ధి పేరుతో చేస్తున్న ప్రతి అవినీతిని అడ్డుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.. ప్రభుత్వం చేసే అవినీతిని అడ్డుకుంటే రాక్షసులమౌతామా అని ప్రశ్నించారు. దోపిడిని ఆపాలనే అడ్డుపడుతున్నామని ఆయన చెప్పారు.

ఉపాధి హామీ నిధుల్లో భారీ అవినీతి జరుగుతోందని, సాక్షాత్తు కేంద్రమే నిధుల దుర్వినియోగం గురించి చెప్పిందని ఆయన వివరించారు. ప్రభుత్వ అవినీతిని అడ్డుకుంటున్నందుకే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని విమర్శించారు
. ఉపాధి హామీ నిధుల అమలును కాగ్ రిపోర్టు తప్పు పట్టిందని వైవీ గుర్తుచేశారు. ఉపాధి హామీ పనులు, నిధుల్లో అవకతవకలు జరిగాయనడానికి తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆయన ఆరోపించారు.
పేదలకు ఉపాధి కల్పించాల్సిన ఉపాధి నిధులను, పచ్చచొక్కాలకు మాత్రమే లబ్థి చేకూరేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని వైవీ విమర్శించారు. పేదల కడుపు కొట్టే ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంటే అభివృద్ధి నిరోధకులు అంటూ వైఎస్సార్సీపీపై బురద చల్లుతారా అంటూ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.
-
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications